Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంలో సీనియర్ పాత్రికేయుడు అప్పరసు కృష్ణారావును ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లో ప్రముఖ డోగ్రీ కవయిత్రి పద్మా సచ్దేవ్ రాసిన కవితలను తెలుగులో గుప్పెడు సూర్యుడు, మరికొన్ని కవితల పేరిట ఆయన అనువదించారు. రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు తాను పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని భాషలను కలిపి మొత్తం 22 భాషల సాహిత్యవేత్తలకు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తోంది.
ఆ రచన అనువాద విభాగం లో ఈ పురస్కారం ఆయనకు దక్కిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ పొందటం పై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. కష్ణారావుకు దక్కిన గౌరవాన్ని మీడియా లోకానికి దక్కిన గుర్తింపుగా భావించి ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులు శుక్రవారం ఘనంగా అభి నందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లోని అంబే ద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు, ఏపీ, తెలంగాణ భవన్ సమాచార విభాగ అధికారులు హాజరయ్యారు.