Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగతా పిటిషన్లతోపాటు విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై మరో పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. లక్నోకు చెందిన ఇద్దరు న్యాయవాదులతోపాటు మొత్తం ఏడుగురు ఈ పిటిషన్ను వేశారు. తాము రామభక్తులమని తెలిపిన పిటిషనర్లు, 1993లో కేంద్ర ప్రభుత్వం అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని ప్రశ్నించారు.
1992, డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును హిందూత్వ సంస్థలు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటన తర్వాత అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పివి నర్సింహారావు ప్రభుత్వం అయోధ్యలోని 67.703 ఎకరాల స్థలాన్ని 1993లో స్వాధీనం చేసుకున్నది. కాగా, కేంద్రానికి రాజ్యాంగపరంగా భూసేకరణకు అధికారం లేదని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ను ప్రధాన కేసుతోపాటు విచారించనున్నట్టు చీఫ్ జస్టిస్ రంజన్గొగోరు, జస్టిస్ సంజరుఖన్నాతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది. రామజన్మభూమి-బాబ్రీ మసీద్(ప్రధాన) కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఇటీవలే సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేయడం తెలిసిందే. 67.703 ఎకరాల్లో వివాదాస్పద స్థలం మినహాయించి, మిగతా స్థలాన్ని భూ యజమానులకు అప్పగించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరింది. కేంద్రం ప్రకారం వివాదాస్పద స్థలం కేవలం 0.313 ఎకరాలు మాత్రమే. కూల్చివేతకు గురైన బాబ్రీ మసీద్ స్థలంమినహా దాని చుట్టుపక్కల ఉన్నదేదీ వివాదాస్పద స్థలం కాదని కేంద్రం తన పిటిషన్లో పేర్కొన్నది. అందులో 42 ఎకరాలు రామజన్మభూమిన్యాస్దిగా చెబుతున్నారు. అయితే,67.703 ఎకరాల్లో స్టేటస్ కో(యథాతథ స్థితిని) కొనసాగించాలని 2003లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకొని భూ యజమానులకు వివాదరహిత స్థలాన్ని అప్పగించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై త్వరగా తేల్చాలని కేంద్రం కోరగా, అంత తొందరేమీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా లక్నోకు చెందినవారు వేసిన పిటిషన్లో రామజన్మభూమిన్యాస్, మానస్భవన్, సంకట్మోచన్ మందిర్, రామజన్మస్థాన్ ఆలయం, జానకీ మహల్, కథా మండప్ స్థలాల్లో తమ ఆచారాల ప్రకారం పూజలు, దర్శనం నిర్వహించుకొనుటకు అనుమతించాలని కోరారు. అటు కేంద్రంగానీ, ఇటు యూపీ ప్రభుత్వంగానీ తమ ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నిలువరించాలని వారు తమ పిటిషన్లో కోరారు.