Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూ ఢిల్లీ బ్యూర్ణో
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అనుమతులపై అభ్యంతం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటీషన్పై విచారణను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) మార్చి 5కి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం ఎన్జీటీ వెల్లడించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సరైన అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ హర్షవర్ధన్ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యూనల్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తరపున వాదనలు విన్న ఎన్జీటీ కేసును స్వీకరించింది. అయితే శుక్రవారం పిటీషన్ తరపున న్యాయవాది కేసు విచారణకు హాజరు కాలేదని... అందుచేత కేసును మార్చి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ ఎస్ రాఘవేంద్ర ఎస్ రాథోడ్ ధర్మాసనం స్పష్టం చేసింది.