Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: జనసేన పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలవాలనుకునే ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరం, అర్హంఖాన్, పి.హరిప్రసాద్, మహేంద్రర్రెడ్డిలు శుక్రవారం ఉదయం నుంచి అభ్యర్ధుల బయోడేటాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల నుంచి ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని, బయోడేటాలను పూర్తి చేశారు. స్క్రీనింగ్ కమిటీ ప్రతి ఒక్కరి దరఖాస్తుని సునిశితంగా పరిశీలిస్తూ, పార్టీ అధి నేత పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా పని చేస్తోందని నాయకులు తెలిపారు. దరఖాస్తుల సంఖ్య అధికంగా ఉండటంతో శుక్రవారం రాత్రి 11 గంటల వరకూ స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.