Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'అవంతి' ఫిరాయింపుపై చంద్రబాబు
అమరావతి: ప్రలోభాలు, బెదిరింపులకు అవంతి శ్రీనివాస్ లొంగిపోయారని, మొన్న ఢిల్లీ ధర్నాలో తనవెంటేవుండి, కొద్ది గంటల్లోనే జగన్ గూటికి చేరారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల్లో ఆస్తులున్న వారికి బెదిరింపుల పర్వం కొనసాగుతోందన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కొక స్వార్ధ ప్రయోజనం ఉందన్నారు. ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారగానే చీరాలలో నిరసన వెల్లువెత్తిందన్నారు. స్వార్ధ రాజకీయాలను ప్రజలు ఆదరించరన్నారు. దేశంలో ఎన్నికల ముందు కూటమి అసాధ్యమనుకున్నారు కానీ ప్రీ పోల్ అలయెన్స్ను సాధ్యం చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో బీజేపీ నేతల్లో భయం పట్టుకుందన్నారు. జగన్, కెేసీఆర్ నాటకం దేశం మొత్తానికి తెలిసిపోయిందన్నారు. అందుకే ఏ పార్టీ వారితో జతకట్టలేదన్నారు. మనం చేస్తోంది ధర్మపోరాటమని, కుట్ర దారులకు ఓటమి తప్పదన్నారు. ఆస్తుల విభజనకు కేసీఆర్ సహకరించరని, కేసులతో జగన్మోహన్రెడ్డి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ముగ్గురి కుట్రలు ఏపీికి నష్టం చేయడమేనన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వక పోవడాన్ని చిదంబరం కమిటీ ప్రశ్నించిందన్నారు. అరకొర విపత్తు సాయాన్ని నిన్ని మొయిలీ కమిటీ నిగ్గదీసిందన్నారు. హుద్హుద్ తుఫాన్కు సంబందించి ఇంకా రు. 400కోట్లు ఏపీకి ఇవ్వాల్సి ఉందన్నారు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ నిలదీయాలన్నారు. 2019-24 అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అభివృద్ది, సంక్షేమమే మన లక్ష్యంగా చంద్రబాబు పేర్కొన్నారు.