Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నేత తరిగామి
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో సామరస్యం, సోదరభావం నెలకోల్పడానికి రాజకీయ నేతలు, పౌర సమాజం, మీడియా కృషి చేయాలని సీపీఐ(ఎం) నేత మహమ్మద్ యూసఫ్ తరిగామి విజ్ఞప్తి చేశారు. పుల్వామా దాడిలో మృతి చెందిన జవాన్లకు తరిగామి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అనేక మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారని, బాధిత కుటుంబాల దుఖాన్ని, బాధను సీపీఐ(ఎం) పంచుకుంటుందని తెలిపారు. కాశ్మీర్ ప్రజల చట్టబద్ధమైన ఆందోళనలను, ఆకాంక్షలను పరిష్కరించడానికి విశ్వసనీయమైన చర్చలు ఒక్కటే మార్గమని తరిగామి స్పష్టం చేశారు. కాశ్మీర్లో సామరస్యం, సోదరభావం నెలకొల్పడానికి, ఇక్కడ ప్రజల జీవితాలకు భద్రత కల్పించడానికి రాజకీయ పార్టీలు, పౌర సమాజం, మేధావులు కృషి చేయాలని, ఒక వేళ అది జరగపోతే మిగిలిన భారత దేశం నుంచి కాశ్మీర్ను విభజించాలని చూస్తున్న శక్తులు విజయం సాధిస్తాయని తరిగామి హెచ్చరించారు. అలాగే ఈ దారుణ దాడి తరువాత రాష్ట్రంలో ఒక వర్గానికి చెందిన వాహనాలు ధ్వంసం కావడానికి గవర్నర్ పాలన బాధ్యత వహించాలని, జమ్మూలో సమస్యాతక ప్రాంతాల్లో అలర్లు జరగకుండా సిబ్బందిని నియమించాలని తరిగామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.