Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్సభ పోరులో ఏ పార్టీకీ మద్దతివ్వం
- తమిళనాడులో నీటి సమస్యను పరిష్కరించే పార్టీకే ఓటు వేయాలి : రజనీకాంత్
చెన్నై: దక్షిణాది ప్రముఖనటుడు, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదని తెలిపారు. అలాగే ఆ ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ప్రకటించబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు 'రజనీ మక్కల్ మండ్రం' లెటర్ హెడ్తో ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని తెలిపారు. రజనీ మక్కల్ మండ్రం పేరిట కానీ, రజనీ ఫ్యాన్ క్లబ్ పేరిట తన ఫోటోలు, జెండాలు ఎవరూ ఉపయోగించకూడదని, ఏ పార్టీకి మద్దతునివ్వడం, ప్రచారం కానీ చేయకూడదన్నారు. కేంద్రంలో పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే, తమిళనాడు నీటిసమస్య పరిష్కరించగలిగే పార్టీకే ఓటువేయాలని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలకు చెందిన రజనీ మక్కల్ మండ్రం సెక్రెటరీలతో ఆదివారం చర్చించినానంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. 2017 డిసెంబర్ 31న రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజనీకాంత్.. ఇప్పటి వరకు పార్టీ పేరును ప్రకటించకపోవడం గమనార్హం. అలాగే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు, నిర్ణయాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడానికే ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.