Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కత : శారద చిట్ ఫండ్ స్కామ్లో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం భార్య నళినీ చిదంబరానికి తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో ఆరు వారాల పాటు ఆమెను అరెస్టు చేయకుండా కోల్కతా హైకోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్యాప్తునకు ఆమె సహకరించాలని జస్టిస్ జోరుమల్యా బగ్చి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశించింది. అలాగే ఈ కేసులో సీబీఐ, నళినీలు తమ వాదనలతో కూడిన అఫిడవిట్లు దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. సోమవారం విచారణలో నళిని తరుపు న్యాయవాది ప్రదీప్ ఘోష్ తమ వాదన వినిపిస్తూ, '2016 చార్జీషీట్లో నళినీ పేరు లేదని, ఈ ఏడాది జనవరి 11న నమోదు చేసిన అదనపు చార్జీషీట్లోనే ఆమె పేరు నమోదు చేశారని' పేర్కొన్నారు. అయితే శారద గ్రూప్ నుంచి నళినికి రూ 1.3 కోట్లను అక్రమంగా చెల్లించారని సీబీఐ, ఈడీలు కోర్టుకు తమ వాదనను వినిపించాయి. శారద గ్రూప్నకు న్యాయ సలహాదారుగా ఉన్న కారణంగానే ఈ మొత్తాన్ని చెల్లించారని ప్రదీప్ ఘోష్ కోర్టుకు తెలిపారు.