Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : ముఖ్యమంత్రు లకు అధికారికంగా కేటాయించిన బంగళాలు జీవితాంతం ఉంచుకో వడానికి కాదని, పదవీకాలం ముగిసిన తర్వాత వాటిని ఖాళీ చేయాల్సిందేనని పాట్నా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్, రబ్రీదేవి, జీతన్రాం మాంఝీ, జగన్నాథ్ మిశ్రా, సతీశ్సింగ్, ప్రస్తుత సీఎం నితీశ్కుమార్లకు చీఫ్ జస్టిస్ ఎ.పి. షాహి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నితీశ్కుమార్ ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు కేటాయించిన బంగళాను ఇప్పటికీ ఖాళీ చేయలేదు. పైగా.. మరో అధికారిక బంగళాను వినియోగిస్తున్నారు.