Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మీడియాల ద్వారా మహిళా జర్నలిస్టులను వేధింపులకు గురిచేయడంపై ఢిల్లీ జర్నలిస్టు యూనియన్ (డీజేయూ) దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. సామాజిక మీడియాలో పురుష, మహిళా జర్నలిస్టులు వేధింపులకు గురవుతున్న సంఘటనలు చాలా ఉన్నాయని, అయితే మహిళా జర్నలిస్టులపై వ్యక్తిగతంగానూ, అసహ్యకరంగానూ, అత్యాచారం చేస్తామని, హత్య చేస్తామని తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్నారని డీజేయూ ప్రధాన కార్యదర్శి సుజతా మాథోక్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా బర్ఖా దత్ అనే మహిళా జర్నలిస్టు ఇలాంటి వేధింపులకు గురువు తున్నారని తెలిపారు. సుజాత్ మాథోక్ ఇటీవల ట్వీట్టర్లో 'అనేక సంవత్సరాలుగా మహిళలు వేధింపులకు, దూషణలకు గురవుతున్నారు. అయితే మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా, అవి చట్టం, అధికార కోరల్లో చిక్కుకునిపో యాయి' అని పోస్ట్ చేశారు. అయితే దీనిపై అనేక మంది సుజాత్ మాథోక్పై బెదిరింపు లకు దిగారు. వ్యక్తిగతంగానూ, అసభ్యంగా నూ వేధింపులకు దిగారు. దీనిపై డీజేయూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అన్లైన్ దుర్విని యోగాన్ని ఆపాలని విజ్ఞప్తి చేసింది. అసభ్య మైన వ్యాఖ్యలను బ్లాక్, మ్యూట్ చేయడంతో సరిపోదని, దీనికి ఒక నిర్ధిష్టమైన పారదర్శ కమైన విధానం ఉండాలని విజ్ఞప్తి చేసింది.