Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఒత్తిళ్ల గురించి ఓ పత్రికకు తెలిపిన తర్వాత చర్య
లక్నో : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై జాతీయ భదత్ర చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేసిన ఓ పోలీసు అధికారి సస్పెన్షన్కు గురయ్యారు. 2002లో గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నప్పుడు యోగిపై మహారాజ్గంజ్ జిల్లా ఎస్పీగా ఉన్న జస్వీర్ సింగ్ ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేశారు. కాగా, యోగిపై కేసు నమోదు చేసిన తర్వాత తాను ఎదుర్కొన్న ఒత్తిళ్లను ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించిన తర్వాత ఆయనపై ఈ సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. రాష్ట్ర పోలీసు ప్రతినిధి ఆర్కె గౌతమ్ ఈ సస్పెన్షన్ను ధృవీకరించారు. యోగిపై ఎన్ఎస్ఏ కేసు నమోదు చేసిన తర్వాత తనకు అప్రధాన బాధ్యతలు అప్పగించారని సింగ్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని బీఎస్పీ ప్రభుత్వం.. ఈ కేసును ఉపసంహరించాలని తీవ్ర ఒత్తిడి తీసుకొ చ్చిందని అన్నారు. అయితే కేసును ఉపసంహరించేందుకు తిరస్కరించిన రెండు రోజుల తర్వాత తనను యూపీ పోలీసు ఫుడ్ సెల్కు బదిలీ చేశారని తెలిపారు. రాజకీయ నేతలపట్ల భక్తిభావంతో మెలగాలని వారు కోరుకునేవారని హఫింగ్టన్ పోస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైందని, మనం ప్రతిఘటించకుంటే పరిస్థితులు మారదని అన్నారు.