Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం : జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ వసంత కుమార్ కుటుంబానికి కేరళ ప్రభుత్వం రూ.25లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతను సమావేశమైన రాష్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జవాన్ వసంత కుమార్ ఇద్దరి పిల్లలు అమన్ దీప్ (5), అనామిక (8)ల విద్యకు అయ్యే ఖర్చును కూడా భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత విజయన్ విలేకరులతో మాట్లాడుతూ వసంత్ భార్య షీనాకు పర్మినెంట్ ఉద్యోగం ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అలాగే ఆ కుటుంబానికి పక్కా నివాస భవనాన్ని నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.