Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ :ప్రతిపక్ష నేత వైఎస్ జగన్తో సినీ నటుడు నాగార్జున భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం లోటస్పాండ్లో దాదాపు అరగంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఎన్నికల వేళ ఈ ఇరువురు సమావేశం కావడం కలకలం రేపింది. నాగార్జన గుంటూరు నుండి వైసిపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారని వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన నాగార్జున రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ను కలవడంపై రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు. జగన్ తమ కుటుంబానికి సన్నిహితుడని, పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని తెలిపారు. మరోవైపు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కూడా ఈ ఇరువురి భేటీపై స్పందించారు. నాగార్జున తనకు మంచి స్నేహితుడని ఆయన చెప్పారు.