Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైలెట్ మృతి
బెంగుళూర్: వైమానిక దళ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. భారత వాయు సేన(ఐఏఎఫ్)కు చెందిన రెండు జెట్ విమానాలు మంగళవారం పరస్పరం ఢ కొన్నాయి. రెండేండ్ల కోసారి జరిగే ఏరో ఇండియా సన్నాహక కార్యక్రమంలో భాగంగా బెంగుళూర్లోని ఎల్హంక ఏయిర్ బేస్లో రిహాల్సల్స్ నిర్వహించారు. విన్యాసాల్లో భాగంగా సూర్యకిరణ్ విభాగానికి చెందిన రెండు హాక్ జెట్లతో పైలెట్లు విన్యాసాలు చేశారు. కాగా రెండు జెట్ విమానాలు పరస్పరం ఢ కొన్నాయి. దీంతో విమానాలు గాలిలో ఉండగానే కాలిబూడి దయ్యాయి. ఈ ఘటనలో ఓ పైలెటు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు పైలెట్లకు తీవ్రగాయాలయినట్టు అధికారులు వెల్లడించారు. క్షతగా త్రులను చికిత్స నిమిత్తం కమాండ్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియోలో చిత్రీకరించాడు. ప్రమాదాన్ని పసిగట్టి ఓ విమానంలోని ఇద్దరు పైలెట్లు పారాచూట్ సహాయంతో కిందకి దూకారని, ఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షి వివరించాడు.