Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నియామకంపై
- విచారణ అవసరంలేదు : సుప్రీం
న్యూఢిల్లీ : సీబీఐకి కొత్త డైరెక్టర్ను నియమించినందున, తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకంపై విచారణ జరపా ల్సిన అవసరంలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది. ఇంకా ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సినదేమీ లేదని ధర్మాసనం పేర్కొంది. అలోక్వర్మ, రాకేశ్ ఆస్థానాల పరస్పర అవినీతి ఆరోపణలతో సీబీఐ వివాదం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో వీరిని సెలవుపై పంపిన కేంద్రం సీబీఐ బాధ్యతలను నాగేశ్వరరావుకు అప్పగించింది.
అయితే కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలోక్వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అలోక్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జనవరి 8న న్యాయస్థానం ఆదేశించింది. కాగా, సుప్రీం తీర్పు వచ్చిన రెండు రోజుల్లోనే అలోక్వర్మను పదవి నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నాగేశ్వరరావుకు మళ్లీ తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది.
దీంతో తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ 'కామన్కాజ్' అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మరోవైపు సుప్రీం ఆదేశాలమేరకు ఈనెల 4న సీబీఐ నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈనేపథ్యంలో కామన్కాజ్ పిటీషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పిటీషన్ను తోసిపుచ్చింది. కామన్కాజ్ వేసిన పిటీషన్పై విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ ఎ.కె.సిక్రీ, జస్టిస్ ఎన్.వి.రమణ స్వయంగా తప్పుకోవడంతో జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది.