Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10.3% స్ట్రెస్డ్ అసెట్స్తో మొదటి స్టానంలో
- మొండి బాకీలు దాదాపు 13.3 లక్షల కోట్లు
- ఆందోళన కలిగిస్తున్న ఐఎంఎఫ్ నివేదిక..
- అయినా.. ఎగవేతదారుల పేర్ల వెల్లడికి నో!
- సుప్రీం జోక్యం చేసుకున్నా స్పందన అంతంతే
న్యూఢిల్లీ: అత్యధిక మొండి బకాయిలతో సతమతమవుతున్న ప్రపంచంలోని 10 టాప్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మొదటిస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రూపొందించిన ఆర్థిక సూచీ ప్రకారం భారత్ 10.3 శాతం మొండి బాకీలతో (ఒత్తిడిలో ఉన్న అప్పులు) ప్రథమ స్థానంలో నిలిచింది. గతంలో మొదటి స్థానంలో ఉన్న ఇటలీ ఇప్పుడు 9.9 శాతంతో రెండో స్థానానికి చేరింది. మిగతా టాప్ 8 స్థానాల్లో బ్రెజిల్ 3.2 శాతం, ఫ్రాన్స్ 2.9 శాతం, చైనా 1.9 శాతం, జర్మనీ 1.5 శాతం, బ్రిటన్ 1.2 శాతం, జపాన్ 1.1 శాతం, అమెరికా 0.9 శాతం, కెనడా 0.4 శాతం ఉన్నాయి. గతంలో అధిక మొండి బాకీలతో సతమతమైన ఇటలీ రుణ రికవరీ ప్రక్రియలో పలు నిర్మాణాత్మక చర్యలు చేపట్టడంతో మొండి బాకీల రుణా భారాన్ని కొంత తగ్గించుకొని 22,700 కోట్ల డాలర్లకు పరిమితం చేసుకోగలిగింది. బ్లూమ్బెర్గ్ నివేదికలో ఆర్బీఐ డిసెంబర్లో చెప్పిన లెక్క ప్రకారం బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలు 19000 కోట్ల డాలర్లుగా (రూ.13, 30,000 కోట్లు) ఉంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది పార్లమెంట్లో చెప్పిన లెక్క ప్రకారం 2014-15 ఆర్థిక ఏడాది నుంచి 2017 సెప్టెంబర్ వరకు ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.2 లక్షల 42 వేల కోట్ల రుణాలను రద్దు చేశాయి. అయితే, రద్దయిన రుణాల్లో ఎక్కువ భాగం కార్పొరేట్ సంస్థల యజమానులవేనన్నది చెప్పకనే అర్థం చేసుకొనే అంశం.
ఎగవేతదారుల పేర్ల వెల్లడికి విముఖత..
ఇంత జరుగుతున్న దేశీయంగా బ్యాంకులకు భారీగా రుణాలను ఎగవేసిన వారి పేర్లను వెల్లడించడంలో మాత్రం ప్రభు త్వం ముందుకు రావడం లేదు. రిజర్వ్ బ్యాంక్ చట్టం-1934లోని సెక్ష న్ 45-ఈ ప్రకారం ఎగవేతదారుల పేర్లు బయటపెట్టలేమని కేంద్రం సాకు చెబుతోంది. ఎగవేతదారుల వివరాలను బయటపెట్టాలని కోరుతు న్న ఆర్టీఐ దరఖాస్తుదారులను అడ్డుకునేందుకు సెక్షన్ 45-ఇని ఆర్బీఐ ఒక కవచంగా ఉపయోగిస్తోంది. దీంతోపాటు సెక్షన్ 45-ఇ(3) ప్రకా రం కోర్టుగానీ, ట్రిబ్యునల్గానీ ఈ విషయమై ఇచ్చే ఆదేశాలను తాము పాటించాల్సిన అవసరంలేదని ఆర్బీఐ చెబుతోంది. పెద్ద మొత్తాల్లో ఎగవేతలకు పాల్పడ్డ కార్పొరేట్లను కాపాడేందుకు ఆర్బీఐ చట్టాన్నే మోడీ ప్రభుత్వమూ రక్షా కవచంగా ఉపయోగిస్తోంది. ఆర్టీఐలోని సెక్షన్ 8(1)(డీ) ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపే సమా చారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ సమర్థించుకో చూసింది. కానీ, ఇటువంటి చట్టాలను అడ్డుపెట్టుకునే ఆర్థిక సంస్థలు పారదర్శకంగా, స్వచ్ఛదంగా వ్యవహరించలేకపోతున్నాయన్న అను మానాలు తమకున్నాయని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా ఘాటుగానే వ్యాఖ్యానించింది. ఎగవేతదారులను కాపాడే చర్యలు దేశ ప్రయోజనాల దృష్టితో ఏమాత్రం సరైంది కాదని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడినవారి వివరాలు ఇవ్వడం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ కు మేలు జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పేర్లు బయట పెట్టకపోవడం వల్లే నష్టం జరుగుతుందని తెలిపింది. ప్రజలకే సార్వభౌ మత్వమున్న దేశంలో అక్రమాలను బయట పెడితే నష్టమని చెప్పడం ఆధార రహితమని సుప్రీంకోర్టు దుయ్యబట్టింది. అయినా ఆర్బీఐ తీరులో మార్పు కనిపించకపోవడం విశేషం.