Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బులు తీసుకొని బాలీవుడ్ ప్రచారం
- సామాజిక మాధ్యమంలో రాజకీయ పార్టీల ఎజెండా అమలుకు ఓకే
- రూ.2లక్షల నుంచి రూ.20కోట్ల వరకు డిమాండ్ : 'కోబ్రా పోస్ట్' స్టింగ్ ఆపరేషన్లో బహిర్గతం
న్యూఢిల్లీ : ఆన్లైన్ న్యూస్ పోర్టల్ 'కోబ్రా పోస్ట్' మరో సంచలనాత్మక వార్తా కథనం విడుదల చేసింది. డబ్బులు తీసుకొని రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేయడానికి 30మందికిపైగా బాలీవుడ్, టీవీ ప్రముఖులు అంగీకరించారనీ, బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పేర్లు చెప్పగానే ఆసక్తి చూపారనీ 'కోబ్రా పోస్ట్' స్టింగ్ ఆపరేషన్ తేల్చింది. కొంతమందైతే ఏకంగా డబ్బులు తీసుకోవటం కోసం పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, బ్రాంచ్ వివరాల్ని సైతం తమతో పంచుకున్నారని 'కోబ్రా పోస్ట్' ఎడిటర్ ఇన్ చీఫ్ అనురుద్ధ బాల్ వెల్లడించారు.
సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్...వేదికలపై 'ఎన్నికల రాజకీయం' ఏ స్థాయిలో నడుస్తోందో 'కోబ్రా పోస్ట్' తాజా స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది. డబ్బులు ఇస్తే...రాజకీయ పార్టీలు ఎలా చెబితే అలా మాటా'ఆడటానికి' బాలీవుడ్ సినీ ప్రముఖులు సిద్ధమయ్యారని సాక్ష్యాలతో సహా 'కోబ్రాపోస్ట్' ఆరోపిస్తోంది. జాకీ ష్రాఫ్, కైలాష్ ఖేర్, సోను సూద్, వివేక్ ఒబేరారు...మొదలైన సినీ ప్రముఖులు స్టింగ్ ఆపరేషన్లో కెమెరాకు చిక్కారని అనురుద్ధ బాల్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. తమ స్టింగ్ ఆపరేషన్ వీడియోలను 'కోబ్రా పోస్ట్' న్యూస్ పోర్టల్లో వీక్షించవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..''అడిగినంత డబ్బులు ఇస్తే, ఏ రాజకీయ పార్టీకైనా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టడానికి, ఆయా పార్టీల రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లటానికి 36మందికిపైగా బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖులు అంగీకరించారు. లైంగికదాడులు, ఘోర ప్రమాదాలు, వంతెనలు కూలటం...వంటి విషయాల్లో కూడా గుడ్డిగా పాలకుల తీరును సమర్థించడానికి వీరు సిద్ధమయ్యారు. డమ్మీ కాంట్రాక్ట్ పత్రాలపై సంతకాలు చేయడానికి కూడా వారు ఓకే చెప్పారు'' అని చెప్పారు. ఈ స్టింగ్ ఆపరేషన్కు సంబంధించి జాతీయ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పలు విషయాలు ఇలా ఉన్నాయి...బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్...రాజకీయ పార్టీల పేర్లు చెప్పగానే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తమ పాన్ నెంబర్, బ్యాంక్ ఖాతా, బ్రాంచ్ వివరాల్ని సైతం పంపారు. సామాజిక మాధ్యమం వేదికలపై రాజకీయ ప్రచారం కోసం, బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖులు చెప్పిన రేటు రూ.2లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఉంది. కొంతమంది సినీ ప్రముఖులు 8నెలల కాంట్రాక్ట్ సంతకం చేస్తాం, రూ.20కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్టింగ్ ఆపరేషన ఎలా చేశారు..?
'పబ్లిక్ రిలేషన్' సంస్థ నుంచి కొంతమందిని నియమించుకొని ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబ ట్టి మేం మీతో ఒక ఒప్పందాన్ని చేసుకుంటామని వీరు బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖుల, గాయకులు, నృత్యకళాకారుల వ్యక్తిగత మేనేజర్లను సంప్రదించారు. విద్యాబాలన్, అర్షద్ వార్సీ, రాజా మురాద్, సౌమ్యా టాండన్...నటీనటులు మాత్రం 'క్యాష్ ఫర్ ట్వీట్'కు అంగీకరించలేదు.
అంగీకరించినవారు ఎవరు?
'ట్వీట్ ఫర్ మనీ'కి ఒప్పుకున్నవారు, జాకీ ష్రాఫ్, సోనుసూద్, వివేక్ ఒబేరాయ్, శ్రేయాస్ తల్పాడే, సన్నీ లియోన్, శక్తికపూర్, అమీషా పటేల్, టిస్కా చోప్రా, రాఖీ సావంత్, టీవీ ఆర్టిస్ట్ పంకజ్ ధీర్, ఆయన కుమారుడు నికితిన్ ధీర్, పునీత్ ఇస్సార్, రాజ్పాల్ యాదవ్, మినిషా లాంబా, మహిమా చౌదరీ, రోహిత్ రారు, అమన్వర్మ, కోయినా మిత్రా, రాహుల్ భాట్...మొదలైనవారున్నారు. గాయకులు...డలేర్ మెహందీ, మైకా, అభిజీత్ భట్టాచార్య, బాబా సెహెగల్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, కమెడీయన్ రాజూ శ్రీవాస్తవ, కృష్ణా అభిషేక్, విజరు ఈశ్వర్లాల్ పవార్...జాబితాలో ఉన్నారు.
ఆరోపణలు అవాస్తవం : బాలీవుడ్, టీవీ ప్రముఖులు
ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ సినీ ప్రముఖులుంతా కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడా కూడా డబ్బును డిమాండ్ చేయలేదనీ, కోబ్రాపోస్ట్ వారే డబ్బులు ఆఫర్ చేశారనీ వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. కోబ్రాపోస్ట్ చేసిన ఆరోపణలన్నీ ఫేక్ అనీ, తమ సంభాషణల్లో సగాన్ని మాత్రమే చూపి నిజాల్ని దాస్తున్నారనీ బాలీవుడ్, టీవీ నటులు అన్నారు.