Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి శత్రుఘ్నసిన్హా సూచన
పాట్నా : ప్రధాని నరేంద్రమోడీపై బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి వాగ్భాణాలు సంధించారు. ప్రభుత్వం మారే ముందైనా నూతన, మంచి నాయకత్వాన్ని ప్రదర్శించండని మోడీకి పిలుపునిచ్చారు. 'ఇది మంచి సమయమా కాదా అని ఆలోచించవద్దు. ప్రభుత్వం మారేముందు, నూతన, మెరుగైన నాయకత్వాన్ని తీసుకోండి? మీలోని అన్ని రంగులను ప్రదర్శించండి' అని ట్వీట్ చేశారు. గత నెలలో దేశ వ్యాప్తంగా 150 ప్రాజెక్టులు ప్రకటించారని అన్నారు. 'సాంకేతికంగా ఇలా మాట్లాడటం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కాదు. కానీ ఇది తక్కువ సమయంలో విసిరిన ఎన్నికల వల' అని అన్నారు. ఈ ఐదేళ్లలో ఒక్క మీడియా సమావేశంలో కూడా మోడీ ప్రసంగించలేదని బుధవారం శత్రుఘ్నసిన్హా విమర్శించిన సంగతి తెలిసిందే.