Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : టీడీపీ, వైసీపీ,జనసేనతో పాటు ఇతర పార్టీలు, ఇండి పెండెంట్లతో కలిపి గురువారం మొత్తం 125 ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారిలో మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి, పితాని సత్యనారాయణ అచంట, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్ గన్నవరం, విజయవాడ సెంట్రల్ నుంచి బొండ ఉమా, సెంట్రల్ నియోజక వర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి చిగురుపాటి బాబూరావు, వైసీపీ అభ్యర్థిగా మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బొప్పన భవ కుమార్, జనసేన అభ్యర్థిగా బత్తిన రామమోహన్ (రాము), టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్, నందిగామ నుంచి తంగి రాల సౌమ్య, ఆత్మకూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్రెడ్డి, రాజంపేట నుంచి గడికోట శ్రీకాంత్రెడ్డి, రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్రెడ్డి డోన్, పత్తికొండలో డిప్యూటీ సీఎం కెఇ క్రిష్ణమూర్తి, తనయకుడు కెఇ శ్యాంబాబులు, శ్రీశైలం స్థానానికి వైసిపి అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి, కార్తిక్ రెడ్డి, సీపీఐ(ఎం) రంపచోడవరం నియోజకవర్గ అభ్యర్థి సున్నం రాజయ్య మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ధర్మవరం నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి, జనసేన తరపున చిలకం మధుసూదన్రెడ్డి, గుంతకల్లు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా వై.వెంకట రామిరెడ్డి, జనసేన తరపున మధుసూదన్ గుప్తా, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ తరఫున నిమ్మల రామానాయుడు, జనసేన తరపున గుణ్ణం నరసింహ నాగేంద్రరావు (నాగబాబు), చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, వైసీపీ అభ్యర్థి విడదల రజని, పత్తిపాడులో వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ వేశారు.
నామినేషన్ వేసిన పలువురు ఎంపీలు
నంద్యాల పార్లమెంట్కు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఎస్పివై రెడ్డి, కర్నూలు నుంచి టీడీపీ అభ్యర్థిగా కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, విశాఖ నుంచి టీడీపీ అభ్యర్థి ముతుకుమిల్లి శ్రీభరత్, ఏలూరు నుంచి వైసీపీ తరపున కోటగిరి శ్రీధర్, అనంతపురం వైసీపీ అభ్యర్థిగా తలారి రంగయ్య, నరసరావుపేట వైసీపీ అభ్యర్ధిగా విజ్ఞాన్ సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయులు, రాజమహేంద్రవరం వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్, తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.