Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూ ఢిల్లీ బ్యూరో
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ రామచంద్ర కుంతియా మండిపడ్డారు. ప్రజా తీర్పును అవహేళన చేస్తున్నారని.... బెదిరింపు రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఏమాత్రం క్షేమనీయం కాదని చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. కేసీఆర్ ఎన్నిఎంపీ సీట్లు గెలిచినా... ఢిల్లీలో చేసేదేం లేదన్నారు. బీజేపీకి సాగిలపడటం తప్ప మరేం చేయలేరన్నారు. డీకే అరుణ పార్టీ మారడంపై... ఎన్నికల సమయంలో ఆశావహులు అధికంగా ఉంటారని అన్నారు. అందరికీ న్యాయం చేయలేమన్నారు. అడిగిన ప్రతి ఒక్కరికీ సీట్లు కేటాయించడం సాధ్యం కాదన్నారు. పార్టీలు మారడం సాధారణం కానీ కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వాళ్లు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలని హితబోధ చేశారు. తెలంగాణ పీసీసీలో ఇప్పట్లో మార్పు ఉండదన్నారు. ఉత్తమ్ నేత త్వంలోనే ఈ ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. పార్టీలో పదవులు అనుభవించి పార్టీ వీడాక ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఖమ్మం లోక్ సభ రేసులో రేణుకా చౌదరి పేరు పరిశీలనలో ఉందని వెల్లడించారు. తాము తెలంగాణ గవర్నర్ నరసింహాన్ ను కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ, పీసీసీ నేతలతో కలిసి కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తామన్నారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక చర్యలపై అన్ని జిల్లాల్లో సేవ్ డెమోక్రసీ... సేవ్ తెలంగాణ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
పదవుల కోసం రాజీనామా చేయలేదు : రాపోలు
కాంగ్రెస్ పార్టీకి తాను పదవుల కోసం రాజీనామా చేయలేదని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి సేవలందింస్తున్నానని అన్నారు.
తాను తెలుగులో రాసిన ఇందిరా గాంధీ జీవిత చరిత్ర పుస్తకం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎందరో కార్యకర్తలుగా మారారని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడి గా ఎన్నిక అయినప్పటి నుండి ప్రతి ప్రసంగంలోనూ ఎన్నో సమస్యలపై మాట్లాడినట్టు చెప్పారు. గుడ్డి ఎద్దు చేలో పడ్డ రీతిలో మితిమీరిన అవగాహనరాహిత్యంతో అపసవ్య ధోరణిలో అగ్రనేతలున్నారని వివరించారు. తెలంగాణ ఎన్నికల్లో వ్యక్తిగత స్వార్ధాలు అయిన తర్వాతే మిగతా వారికి సీట్లను కేటాయించారన్నారు. ఏ పార్టీలో చేరే విషయం త్వరలో వెల్లడిస్తానని... ఇప్పటివరకు ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.