Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్పై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా తన వాదన వినిపించేందుకు ఏకొద్ది సమయమిచ్చినా పలు కీలక అంశాలను సుప్రీంకోర్టు ముందుంచేవాడినని కేంద్ర మాజీమంత్రి, సీనియర్ జర్నలిస్ట్ అరుణ్శౌరీ తెలిపారు. ఈ నెల 14న రివ్యూ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్గొగోరు నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపిన విషయం తెలిసిందే. 36 రాఫెల్ జెట్లను రూ.59,000 కోట్లకు ఫ్రాన్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసే ఒప్పందంపై గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శౌరీతోపాటు మరో కేంద్ర మాజీమంత్రి యశ్వంత్సిన్హా, సీనియర్ న్యాయవాది ప్రశాంత్భూషణ్ రివ్యూ పిటిషన్లు వేశారు. ఈ డీల్ విషయంలో తాము విచారించాల్సిన అంశాలేమీ లేవంటూ గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా, ఆ తర్వాత ఈ డీల్కు సంబంధించిన కీలక అధికారిక పత్రాలు మీడియాలో లీకయ్యాయి. దాంతో, రివ్యూ పిటిషన్లతో మరోసారి ఈ ముగ్గురూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లీకైన పత్రాలను సాక్ష్యంగా తీసుకోరాదంటూ కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ప్రాథమిక అభ్యంతరాన్ని సుప్రీంకోర్టు ముందుంచారు. దీంతో, కేంద్రం నుంచి వచ్చిన అభ్యంతరంపై తాము ముందుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదంటూ న్యాయస్థానం తన తదుపరి ఆదేశాలను రిజర్వ్ చేసింది. దీనిపై అరుణ్శౌరీ ద వైర్ వెబ్ పోర్టల్కు ప్రత్యేక వ్యాసం వ్రాశారు. ప్రభుత్వ ప్రాథమిక అభ్యంతరాన్ని తిరస్కరించమని కోరామని, అలాగే కోర్టుకు అబద్ధపు సమాచారమిచ్చి తప్పుదోవ పట్టించిన అధికారులను కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలని విజ్ఞప్తి చేశామని అరుణ్శౌరీ తెలిపారు. ఈ నెల 14న జరిగిన తాజా విచారణలో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ తన వాదన వినిపించారు. పిటిషన్లపై ప్రాథమిక అభ్యంతరం వ్యక్తం చేసిన వేణుగోపాల్..రక్షణశాఖకు చెందిన రహస్య పత్రాలను దొంగిలించి ఆధారాలుగా చూపుతున్నారంటూ పదేపదే కోర్టు దృష్టికి తెచ్చారని అరుణ్శౌరీ తెలిపారు. అవి దొంగిలించిన పత్రాలైనందున సాక్ష్యాధారాలుగా పనికి రావంటూ తమ రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలంటూ కోర్టును ఆయన అభ్యర్థించారని శౌరీ తెలిపారు. మార్చి 14న సాయంత్రం 3 గంటలకు విచారణ ప్రారంభం కాగా, అటార్నీ జనరల్ 25 నిమిషాలపాటు తన వాదన వినిపించారని శౌరీ తెలిపారు. ఆ తర్వాత ఏజీ వాదనలను ఖండిస్తూ 35 నిమిషాలపాటు ప్రశాంత్భూషణ్ తన వాదన వినిపించారు. అప్పటికే 4 గంటల సమయం కావడంతో తనకు ఎక్కువ సమయం ధర్మాసనం నుంచి లభించలేదని శౌరీ తెలిపారు. తాము కోర్టు ముందుంచిన పత్రాలు దొంగిలించినవి, రహస్యమైనవి అంటూ పదేపదే చెప్పడం ద్వారా అటార్నీ జనరల్ వాటి వాస్తవికతను ధ్రువీకరించినట్టయిందని శౌరీ స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి గత విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు ఆదేశాలకను గుణంగా కేంద్రం ఇచ్చిన నోట్స్(వివరణ)కూ తామిచ్చిన పత్రాలకూ సంబంధం ఉన్నదని శౌరీ తెలిపారు. ద వైర్, కారవాన్, ద హిందూలో ఎన్ రామ్ ప్రచురించిన దస్త్రాలను ప్రభుత్వం కోర్టు ముందుంచలేదని శౌరీ గుర్తు చేశారు.
రక్షణ పరికరాల సామర్థ్యానికి సంబంధించి రహస్యంగా ఉంచాల్సిన అంశాల గురించి తాము ప్రశ్నించడంలేదని అరుణ్శౌరీ తెలిపారు. అయితే, పరికరాల ప్రామాణికత విషయంలో సరఫరాదారుగానీ, ప్రయివేట్ డెవలపర్స్గానీ అవినీతికి పాల్పడకుండా కట్టడి చేసేలా ఒప్పందంలోని అంశాలు ఉన్నాయా అన్నదానిపైనే తాము ప్రశ్నిస్తున్నట్టు శౌరీ తెలిపారు. యుద్ధ విమానాల సామర్థ్యం గురించి రక్షణశాఖ కార్యదర్శి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కీలక షరతులను ఒప్పందం నుంచి తొలగించడాన్ని తాము ప్రశ్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. భారత సంప్రదింపుల బృందం(ఐఎన్టీ) అనుసరిస్తున్న ప్రక్రియను పక్కనపెట్టి పీఎంవో సమాంతర మంతనాలు జరపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రక్షణశాఖ కార్యదర్శి అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారికర్కు పంపిన నోట్ను శౌరీ ప్రస్తావించారు.