Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీకి డాక్టర్ సునీతా అభ్యర్థన
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ పోలీసుల చేత ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బందం చేసే విచారణపై తమకు నమ్మకం లేదని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి క్షణం సిట్ అధికారులు చంద్ర బాబుకు రిపోర్టు చేస్తూ... ఆయన దర్శకత్వంలో పని చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధి కారులను కలిసి అందుకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ... తమ తండ్రి హత్యకేసును నిష్పక్షపాతంగా విచారించి, అసలు దోషులకు శిక్ష పడేలా చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు. కాగా తన తండ్రి హత్యపై జరుగుతున్న సిట్ విచారణ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నందున దర్యాప్తు సక్రమంగా జరిగేలా చర్చలు తీసుకోవాలంటూ సునీ తా రెడ్డి గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకష్ణ ద్వివేదిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే ఈ కేసు దర్యాప్తు విషయంలో తాము కలుగ చేసుకునే అవకాశం లేదని, ఆ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించడం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరడం కానీ చేయాల్సి ఉంటుందని ఆయన సలహానిచ్చినట్టు ఆమె చెప్పారు. దీంతో సునీతా రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. రాజకీయంగా తమ నాన్నహత్యను వాడుకోవాలని చూస్తున్నారని అన్నారు. తమ సోదరుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుం దని... కాబట్టి విచారణ పారదర్శకంగా జరగడం లేదన్నారు. సీబీఐ లేదా మరే ఇతర విచారణ సంస్థతో దర్యాప్తు జరిపించాలని ఈసీని అడిగినట్టు చెప్పారు. అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర హౌం శాఖను కలవాలని ఈసీ సూచించిందని అన్నారు. ఆ మేరకు కేంద్ర హౌంశాఖను కలిసి విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. ఇదే విషయంపై తమ కుటుంబ సభ్యులు కూడా విజయవాడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు.
వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ : ఎంపీ విజయ
వైసీపీ నేతల ఫోన్లను టీడీపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నదని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఈసీకి ఆయన శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... టీడీపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీకి అనుకులమైన ఓటర్లను తొలగించి టీడీపీకి సపోర్ట్ చేసే ఓటర్లను చేరుస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న దుర్మార్గాలను సీఈసీకి వివరించామన్నారు. ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలు వెంకటేశ్వరావు, ఘట్టమనేని శ్రీనివాస్,యోగానంద, ప్రకాశం జిల్లా ఎస్పీ అందరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరారు. చట్ట వ్యతిరేకంగా 37 మంది సీఐలకు ప్రమోషన్స్ పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణ కాలేజ్ నుంచి డబ్బులు తరలిస్తున్నప్పుడు కారును పట్టుకున్నప్పుడు ఎస్పీ స్వయంగా వచ్చి దాంట్లో ఉన్నది... డబ్బులు కాదు ఎలక్షన్ మెటీరియల్ అని చెప్పి వారిని గమ్య స్థానానికి చేరెలా చూసాడని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం చేస్తున్న చర్యల పైన ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చామన్నారు. కేఏ పాల్ ఒక జోకర్ ఒక బ్రోకర్ లాగా రోజు వచ్చి కామెడీ చేస్తున్నాడన్నారు. ప్రజా శాంతి పార్టీకి కేటాయించిన సింబల్ వైయస్సార్సీపీ పార్టీ గుర్తును పోలి ఉండడం వల్ల గతంలో సీఈసీ తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించి ఆ సింబల్ ని తొలగించాలని కోరారు.