Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ధార్వాడ' ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ దంపతులు
బెంగుళూరు : మార్చి 19న కర్ణాట కలోని ధార్వాడలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలడంతో 14మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ భవన శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయ టకు తీసేందుకు ఇప్పటికీ సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో తాజాగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. శిథిలాల కింద 70 గంటలపాటు మృత్యు వుతో పోరాడిన దంపతులను సహాయక సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. వారి పేర్లు సంగీత, ధాకాలుగా అధికారులు గుర్తించారు. శిథిలాల్లోంచి వారిని బయటకు తీసుకొచ్చిన వెంటనే ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్కు తరలించారు. ''వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. వారిని హాస్పిట ల్కి తరలించాం. చిక్కుకున్న వారం దర్నీ బయటకు తీసుకొచ్చామని నిర్ధారించుకున్నాక, శిథిలాలను పూర్తిగా ఇక్కడి నుంచి తొలగించే పనులను మొదలుపెడతా''మని అగ్నిమాపక, అత్యవసర సేవల అదనపు డీజీపీ సునీల్ అగర్వాల్ తెలిపారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో దాదాపు 70మందిని ఇప్ప టికే సహాయక బృందాలు బయటకు తీసుకొచ్చాయి. ఘట నాస్థలిలో వైద్య బృందంతోపాటు అత్యవసర సేవల బృందాలు ఉన్నాయి. ప్రత్యేక పరికరాలతో పనులు కొనసాగిస్తున్నారు.