Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
జోధ్పూర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో ఆర్ఎస్ఎస్ ఇష్టమున్న ట్టుగా చెలరేగిపోతోందని ఆయన ఆరోపి ంచారు. లోక్సభ ఎన్నికలవేళ ఆయన బీజేపీపై విమర్శల దాడిని పెంచారు. సంఫ్ు పరివార్ అండ దండలు లేకుండా బీజేపీలో ఎవరూ ముఖ్యమంత్రి, మంత్రి పదవులు చేపట్టలేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీగా మారి బీజేపీలో విలీనం కావాలన్నారు.
గతంలో ఆర్ఎస్ఎస్ను బహిష్కరించినప్పుడు, తమది రాజకీయ పార్టీ కాదని ఆర్ఎస్ఎస్ ప్రకటించుకున్న విషయాన్ని గెహ్లాట్ గుర్తుచేశారు. తమది పూర్తిగా సాంస్కృతిక సంస్థ అని రాతపూర్వకంగా ప్రభుత్వానికి తెలిపారని అన్నారు. కానీ తిరిగి ఆ సంస్థ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకుంటోందని ఆయన తప్పుబట్టారు. అప్పట్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆర్ఎస్ఎస్ను డిమాండ్ చేశారు. ప్రధానిగా నరేంద్రమోడీ మళ్లీ పదవీ బాధ్యతలు చేపడితే దేశంలో ఇక ఎన్నికలనేవే ఉండవని కొద్ది రోజుల క్రితం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒకే రాజకీయపార్టీ ఏలుబడిలో ఉండాలన్న బీజేపీ, ప్రధాని మోడీ వ్యూహాలు అమల్లోకి వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.