Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయటకు దూకి ఇద్దరు మృతి
డార్జిలింగ్ (ప.బెంగాల్) : రైలు ఇంజన్లో మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ఇద్దరు ప్రయాణికులు రైలు నుంచి బయటకు దూకి మృత్యువాతపడ్డారు. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. డిబ్రుగఢ్ నుంచి చండీగఢ్ వెళ్తున్న రైలు ఛాతట్ స్టేషన్కు సమీపంలోకి రాగానే, ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాద భయంతో ఇద్దరు ప్రయాణికులు రైలు నుంచి కిందకు దూకి మృతి చెందారని నార్త్ ఈస్ట్ రైల్వే అధికారి భట్టాచార్య తెలిపారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఛాతట్ స్టేషను సమీపంలో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయని నార్త్ ఈస్ట్ రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి జ్యోతిశర్మ అన్నారు. కోల్కతా రైల్వే స్టేషన్కు 550కి.మీ దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరమ్మతులున్న ఇంజిన్ను ఉపయోగించడం వలనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఘటనపై విచారణ చేపడతామని రైల్వే అధికారి శర్మ పేర్కొన్నారు.