Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏలూరు:'ఉద్యోగులకు, రైతులకు సైతం రిటైర్మెంట్ ఉంది. వయస్సు పైబడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఎన్నికల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేద్దాం' అని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. స్థానిక పోలీసు బొమ్మ సెంటర్లోనూ, ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు మండలంలోనూ, ఏలూరులో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. అవినీతి, దోపిడీ, రౌడీయిజం రాష్ట్రంలో రాజ్యమేలుతుందని, దీనిని అంతమొందించడమే జనసేన లక్ష్యమన్నారు. రాజకీయ ప్రక్షాళనను భీమవరం నుంచే ప్రారంభిస్తానని జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నారు. వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్రంధి శ్రీనివాస్, టిడిపి అభ్యర్థిగా ఉన్న పులపర్తి రామాంజనేయులు పట్టణాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి సొంత చిన్నాన్న హత్యకు గురైతే ఏమీ చేయలేక మిన్నకుండిపోయారని, గుండెపోటని కొంతసేపు, హత్యని కొంత సేపు చెప్పడం ఏమిటో అర్ధంకావడం లేదని, ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఘాటుగా విమర్శించారు. భీమవరం నియోజకవర్గాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు అనుగుణంగా వంద అడుగుల విగ్రహాన్ని నెలకొల్పేందుకు పార్టీ తరఫున రూ.కోటి ప్రకటించారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు సభలో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.