Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మణిపూర్ జర్నలిస్టు
ఇంపాల్: ప్రధాని మోడీ, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ను విమర్శించినందుకు జాతీయ భద్రత చట్టం కింద అరెస్టయిన జర్నలిస్టు కిశోర్చంద్ర వాంగ్ఖేమ్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఇంఫాల్లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆయన చికిత్స పొందుతు న్నారు. వాంగ్ఖేమ్ భార్య ఎలాంగ్బమ్ మాట్లా డుతూ.. ఈ నెల 20న ఆయనను జైలు నుంచి ఆస్పత్రికి తీసుకొచ్చారు. కిశోర్చంద్ర అనారోగ్యానికి గురయ్యారని, చికిత్స కోసం జైలు బయట వైద్యుల ను సంప్రదిస్తున్నారని జైలు అధికారులు కిశోర్చంద్ర తరఫు న్యాయవాదికి తెలపడంతో ఈ విషయం తనకు తెలిసిందని అన్నారు. ఆ ప్రాంతం లో కనీసం 20 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారని అన్నారు. కాగా, కిశోర్చంద్రను కలిసేందుకు తనను, తన సోదరుడిని అనుమతిం చలేదని వాపోయారు. ఆయన ఆరోగ్యం విషమం గా ఉందని, బక్కచిక్కిపోయారని అన్నారు. ఆయ న్ను చూసి షాక్ అయిన తన సోదరుడు కిశోర్చంద్రను ఫొటో తీశాడని, కానీ, భద్రతా సిబ్బ ంది డిలీట్ చేయాల్సిందిగా బలవంతం చేశారని అన్నారు. భోజనం చేశాక ఆయన షుగర్ లెవల్స్ చాలా(543కి చేరింది) పెరిగిందని, అందుకే ప్రత్యేక డైట్ను ఇవ్వాలని వైద్యులు నిర్ణయించినట్టు ఆస్పత్రి సిబ్బంది తెలిపారని వివరించారు. కాగా, సూచిం చిన డైట్ను జైలు అధికారులు అందిస్తారన్న నమ్మ కం లేదని ఓ అధికారి చెప్పారని అన్నారు. అయితే ఆ డైట్ను ఇచ్చేందుకు తమకు కూడా అనుమతి వ్వలేదని ఆందోళన చెందుతూ తెలిపారు.
బీజేపీ సర్కారును విమర్శిస్తే..దేశానికే ప్రమాదమా? :
బ్రిటీష్కు వ్యతిరేకంగా ఝాన్సీ రాణి పోరాటం గురించి, ఆమె పోరాటాన్ని మణిపూర్ స్వాతంత్య్ర పోరాటానికి అనుసంధానించే కార్యక్రమాన్ని తలపెట్టడంపై మోడీ సర్కారు, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జర్నలిస్టు వాంగ్ఖేమ్ యూట్యూబ్లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఈ వీడియోను అప్లోడ్ చేసినందుకు జర్నలిస్టు కిశోర్చంద్ర వాంగ్ఖేమ్.. ఇంఫాల్ వెస్ట్ పోలీసులు నవంబర్ 21న సెడిషన్, ఐపీసీలోని 294, 500 సెక్షన్ల కింద అరెస్టు చేశారు. స్థానిక కోర్టు నవం బర్ 26న ఆయనకు బెయిలు మంజూరు చేసినా.. 24 గంటల్లోనే జాతీయ భద్రత చట్టం కింద తిరిగి అరెస్టు చేశారు. దీన్ని సవాలు చేస్తూ కిశోర్చంద్ర.. మణిపూర్ హైకోర్టును ఆశ్రయించారు. వాద ప్రతి వాదాలు ముగిశాయి. అయితే తుది తీర్పును వెలువ రించేందుకు కోర్టు తేదీని ఖరారు చేయాల్సి ఉంది. కాగా, కిశోర్చంద్రను అరెస్టు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైంది. కిశోర్చంద్ర అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి యూఎన్ లేఖ కూడా రాసింది. భావ ప్రకటన స్వేచ్ఛను జాతీయ భద్రత చట్టం ప్రయోగించి నేరపూరితం చేయడంపై ఆందోళన చెందుతున్నట్టు అందులో పేర్కొంది.