Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలోని లోక్సభ స్థానం నుంచి పోటీ?
న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కేంద్ర మంత్రుల సమక్షంలో శుక్రవారం ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గంభీర్కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ విజన్తో తాను ప్రభావితుడయ్యారని చెప్పారు. క్రికెట్కు సేవలు అందించిన తాను ఇప్పుడు దేశానికి మరిన్ని సేవలు అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. పార్టీలోకి ఆహ్వానిస్తూ.. గంభీర్ టాలెంట్ పార్టీకి తప్పకుండా కలిసివస్తుందని అరుణ్ జైట్లీ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలోకి చేరిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఢిల్లీ నుంచి ఎంపీగా చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విషయాన్నే అరుణ్ జైట్లీతో ప్రస్తావించగా.. పార్టీ ఎన్నికల కమిటీ దాన్ని నిర్ణయిస్తుందని అన్నారు.