Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాదుల మరణాలపైఆధారాలు చూపించండి :ఒక పౌరుడిగా నాకు తెలుసుకునే హక్కుంది : శ్యాం పిట్రోడా
న్యూఢిల్లీ : బాలాకోట్ గగనతల దాడిలో ఉగ్రవాదుల మరణాలపై ఆధారాలు చూపించాలని శాస్త్రవేత్త, ఓవర్సీస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చైర్మెన్ శ్యాం పిట్రోడా ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. 'బాలాకోట్లో 300 మంది చనిపో యారు. సరే. దానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు చూపించి నిరూపించాలనే నేను అడుగుతున్నాను. ఇంకా సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ వార్తాపత్రికల ప్రభుత్వ వ్యాఖ్యానాలకు భిన్నంగా కథనాలు ప్రచురిస్తు న్నాయి. అవి చదివితే.. అసలు మనం నిజంగా దాడి చేశామా? 300 మంది ఉగ్రవాదులు చనిపోయా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఒక పౌరుడిగా ఈ విషయా లను తెలుసుకునే హక్కు నాకు ఉంది. నేను.. మనం.. దేశ ప్రజలందరూ వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరము ంది. అంతర్జాతీయ మీడియా ఈ దాడిలో ఒక్కరినీ చంపలేదని చెబుతున్నది. భారతీయ పౌరుడిగా ఈ విష యాలు ఇబ్బందిగా ఉన్నాయ'ని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పిట్రోడా వివరించారు.
'నేను గాంధేయవాదిని. ఏ సమస్యనైనా చర్చలతో పరిష్కరించాలని కోరుకుంటాను. పాకిస్థాన్ మాత్రమే కాదు.. యావత్ ప్రపంచంతో మనం చర్చిస్తున్నామ'ని అన్నా రు. 'పుల్వామా దాడి గురించి పెద్దగా తెలియదు, కానీ, ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముంబయిలో తాజ్ హౌటల్, ఒబెరారు హౌటల్పైనా ఉగ్రదాడులు జరిగాయి. అప్పుడు కూడా ఆ దాడులకు ప్రతిఘటనగా మన విమానాలు పంపించి ఉండేవాళ్లం. కానీ, అది సరైన విధా నం కాదని నేను నమ్ముతాను. ఎనిమిది మంది దుండగులు వచ్చి (ముంబయి దాడులు)ఘాతుకానికి పాల్పడ్డారు. అందు కు ఆ దేశ పౌరులందరినీ తప్పుపట్టలేమ'ని చెప్పారు. కాగా, బాలాకోట్ ఎయిర్స్ట్రైక్పై వైమానికి దళం వివరణలను ప్రశ్నిస్తున్నారా అని అడగ్గా.. గగనతల దాడి వేరు, 300 మంది చనిపోయారని చెప్పడం వేరని పిట్రోడా తెలిపారు. ఈ సమాచారం విషయంలో ఉద్వేగపూరితంగా వ్యవహరిం చాల్సిన అవసరం లేదు. సమాచారం ఎప్పుడూ తటస్థంగా ఉండాలి. కాగా, తన వ్యాఖ్యలన్నీ వ్యక్తిగతమైనవేనని, కాంగ్రె స్తో వీటికి సంబంధం లేదని తెలిపారు. 'నేనొక శాస్త్రవేత్త ను. నా వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. నేను హేతు బద్దతను, లాజిక్ను నమ్ముతాను. ఎమోషన్స్ కాదు, డేటాను నమ్ముతాన'ని అన్నారు.
జవాన్లను అగౌరవపరుస్తున్నారు : మోడీ
కాగా, శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. విపక్షాలు మన జవాన్లను మళ్లీ అగౌరవపరుస్తున్నారని ప్రధా ని ట్వీట్ చేశారు. భారతీయులందరూ విపక్షాల వ్యాఖ్యలను ప్రశ్నించాలని కోరారు. విపక్షాల అసంబద్ధ చర్యలను 130 కోట్ల మంది భారతీయులు క్షమించబోరని వారికి తెలపాలని వివరించారు. యావత్ దేశం సైనికుల పక్షాన నిలబడిందని పేర్కొన్నారు. 'వారు సైన్యంపై ఆరోపణలు చేస్తారు. మనం సైన్యాన్ని చూసి గర్విస్తాం. అదే బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య తేడా' అని అమిత్ షా విమర్శించారు.
ప్రశ్నించడం ప్రాథమిక హక్కు : అఖిలేశ్
బీజేపీ విమర్శలను విపక్షాలు తిప్పికొట్టాయి. 'మన జవాన్ల బలిదానాలను ఎవరూ ప్రశ్నించరని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ప్రశ్నించడం ప్రాథమిక హక్కు అని తెలిపారు. ఈ ప్రభుత్వం స్వతహాగా సైన్యంలా వ్యవహరిం చడాన్ని మానుకోవాలని విమర్శించారు. ప్రశ్నించొద్దని వారించే రాజకీయ నేతలే అత్యంత ప్రమాదకరమని ఆయన వివరించారు. మోడీ ప్రభుత్వ నిఘా వైఫల్యం వల్లే పుల్వా మా ఉగ్రఘాతుకం చోటుచేసుకుందని కాంగ్రెస్ విమర్శిం చింది. బాలాకోట్ ఎయిర్స్ట్రైక్ మనదేశ వైమానిక దళ ధీరత్వానికి తార్కాణం అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు.