Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : సార్వత్రిక ఎన్నికలకు గానూ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం రోజు ఆయన తన నామి నేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ పార్టీ లైన కాంగ్రెస్, బీజేపీలు ప్రజల సమస్యలను పరిష్క రించడంలో పూర్తిగా విఫలమయ్యా యని విమర్శిం చారు. తాను ప్రజల గొంతుకగా పనిచేస్తానని తెలిపారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పిసి మోహన్ను ఆయన ఎదుర్కోనున్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రకాశ్రాజ్కు మద్దతు ప్రకటించింది.