Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి :లోక్సభకు, రాష్ట్ర శాసనసభకు సిపిఐ., జనసేన, బిఎస్పిలు బలపరిచిన సిపిఎం అభ్యర్ధులు పలువురు శుక్రవారం ఆయా రిటర్నింగ్ అధికారుల ఎదుట తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. అరుణ పతాకాలు రెపరెపలాడాయి. కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. డప్పు దళాలు హోరెత్తించాయి.
కర్నూలులో...
కర్నూలు లోక్సభ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా కె.ప్రభాకర్రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థిగా టి.షడ్రక్ నామినేషన్లు వేశారు. అంతకు ముందు కర్నూలులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు ఎం.గఫూర్ , సిపిఐ రాష్ట్ర నాయకులు కె.జగన్నాథం, జనసేన నాయకులు హర్షద్, బిఎస్పి నాయకులు కరుణాకర్ పాల్గొన్నారు.
నెల్లూరులో
నెల్లూరు లోక్సభ స్థానానికి సిపిఎం అభ్యర్థి చండ్ర రాజగోపాల్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్. ముత్యాలరాజు ఎదుట తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నగరంలోని బోసుబొమ్మ సెంటర్ (ఎబిఎం) కాంపౌండ్ నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్లు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
సంతనూతలపాడులో...
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు సిపిఎం అభ్యర్థి జాలా అంజయ్య చీమకుర్తిలో నామినేషన్ వేశారు. జనసేన జిల్లా నాయకులు కందుకూరి బాబు, సిపిఐ జిల్లా నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఎం డివిజన్ కార్యదర్శి ఎస్కె మాబు, జిల్లా నాయకులు కంకణాల ఆంజనేయులు, సిపిఎం తరుపున న్యాయవాది యడవలి రమేష్ ఆయన వెంట ఉన్నారు.
అరకులో
విశాఖ జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి కిల్లో సురేంద్ర నామినేషన్ను దాఖలు చేశారు. గిరిజన సంఘం కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.