Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శివపాల్ యాదవ్ ఆరోపణ
లక్నో : సమాజ్వాది పార్టీ (ఎస్పీ) టిక్కెట్లను అమ్ముకుంటోందని ప్రగతిశీల సమాజ్వాది పార్టీ (లోహియా) (పీఏపీఎల్) నేత శివపాల్ యాదవ్ శనివారం ఆరోపించారు. ఎస్పీ తన సిద్ధాంతాలతో రాజీపడిందని అన్నారు. సమాజ్వాది గురించి తెలియని వారు టికెట్ కోసం నగదు ఇస్తున్నారని అన్నారు. రూ. 10, 15, 20, 25 కోట్లు ఇవ్వగలిగిన సంపన్నులకు ఎస్పీ తన టిక్కెట్లు అమ్ముకుంటోందని అన్నారు. నిజమైన సమాజ్వాది సిద్ధాంతాలను అనుసరిస్తున్న వారు క్రమంగా పార్టీని వీడుతున్నారని అన్నారు. బీజేపీని ఓడించేందుకు పీఎస్పీఎల్, కాంగ్రెస్ల మధ్య పొత్తును ప్రజలు కోరుకున్నారని, అయితే కాంగ్రెస్లోని కొందరు నేతలు వారి నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారనీ దీంతో కూటమి ఏర్పడలేదని యాదవ్ అన్నారు.