Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజానికి ఏం సందేశం ఇస్తుందో ఆలోచించుకోవాలి : పినరరు విజయన్
తిరువనంతపురం : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ దక్షిణాదిలో పాగా వేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయానాద్ స్థానం నుండి పోటీచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ విభాగం రాహుల్ను కోరగా అంగీకరించినట్టు ఊహాగానాలు వెలువ డుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కన్వీనర్ బెన్నీ బెహనన్ మాట్లాడుతూ దీనిపై అధికార ప్రకటన త్వరలో విడుదల కానున్నట్టు తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ పతనంతిట్ట జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దక్షిణాదిలో ఏదైనా లోక్సభ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేయాలని పార్టీ శ్రేణు లు డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. తాము వయానాద్ నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్టు వెల్లడించారు. అయితే రాహుల్ ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని అన్నారు. మొత్తం 20 లోక్సభ స్థానాలు గల కేరళలో కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఇప్పటి వరకు 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వయానాద్లో అభ్యర్థిని ఖరారు చేయలేదు.
కాంగ్రెస్ ప్రతిపాదనపై ఎల్డిఎఫ్ నేతృత్వంలోని కేరళ ముఖ్య మంత్రి పినరరు విజయన్ స్పందించారు. బీజేపీపై పోరాడేందుకు కాకుండా ఎల్డీఎఫ్పై పోటీచేసేందుకు రాహుల్ ఇక్కడకు వస్తున్నారని కన్నూర్ సమావేశంలో అన్నారు. సమాజానికి ఏం సందేశం పంపించాలని భావిస్తుందో కాంగ్రెస్ ఆలోచించుకోవాలని అన్నారు.