Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మరో జాబితా
భోపాల్, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో పోటీకి 34 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మరో జాబితాను శనివారం విడుదల చేసింది. భోపాల్ నుంచి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేరును కేంద్ర ఎన్నికల ప్రచార కమిటీ ఖరారు చేసిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ చెప్పారు. శనివారం విడుదల చేసిన జాబితాలో జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్ నుంచి రెండేసిచొప్పున, మహారాష్ట్ర అయిదు, తమిళనాడు ఎనిమిది, ఉత్తరప్రదేశ్ తొమ్మిది, తెలంగాణ, పుదుచ్చేరి నుంచి ఒక్కోస్థానానికి అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఖమ్మం పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ తనయుడు విక్రమాధిత్య సింగ్ (జమ్మూ కాశ్మీర్)లోని ఉదంపూర్ నియోకవర్గం నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పై పోటీచేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్సిక్రీ స్థానం నుంచి ఆ పార్టీ యూపీ చీఫ్ రాజ్బబ్బర్ పోటీ చేస్తున్నారు.