Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ, పంజాబ్, దక్షిణాన దారుణం
- తమిళనాడులో 2.2శాతమే ఆయన పాపులారిటీ
- పంజాబ్లో 12శాతం, యూపీలో 43.9శాతం
- సీ-ఓటరు సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మానియాతో సునామీ సృష్టిస్తామని ప్రగల్భా లు పలుకుతున్న బీజేపీకి చేదు వార్త ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాదరణ తగ్గిందని తాజా సర్వేలో తేలిపోయింది. ప్రధానంగా యూపీతో పాటు పంజాబ్, దక్షిణాది రాష్ట్రాలలో ఆయన గ్రాఫ్ పడిపోయింది. దక్షిణాదినే కాకుండా దేశవ్యాప్తంగా చూసుకుంటే తమిళనాడులో మోడీ పాపులారిటీ చాలా దారుణంగా ఉన్నది. అక్కడ కేవలం 2.2శాతం మంది ఓటర్లు మాత్రమే మోడీ పాలనపట్ల సంతృప్తి తో ఉన్నారు. ఈ సమాచారమంతా సీ-ఓటరు సర్వే లో తేలింది. దేశంలో ఉన్న మొత్తం 543 పార్లమెం టుస్థానాల్లో 60వేల మందికి పైగా ఓటర్లను సంప్ర దించి సీ-ఓటరు సర్వేను నిర్వహించింది.
కేరళలో శబరిమల అంశాన్ని తమకు అనుకూ లంగా ఉపయోగించుకొని ఆరెస్సెస్ అండతో అక్కడ పాగా వేయాలని కాషాయదళం ఉవ్విళూరుతోన్న విషయం తెలిసిందే. కానీ, అక్కడ మోడీకి కేవలం 7.7శాతం ప్రజాదరణ ఉన్నది. కేంద్రపాలిత ప్రాం తం పుదుచ్చేరిలో 10.7శాతం మంది ఓటర్లు మాత్ర మే మోడీ పట్ల సానుకూలంగా ఉన్నారు. అలాగే కర్నాటకలో కేవలం 38.4శాతం మంది ప్రజలే మోడీ పట్ల సంతృప్తితో ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ(37.7శాతం), ఆంధ్రప్రదేశ్ (23.6శాతం)లలో కూడా ఓటర్లు 'చౌకీదార్' పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక్క గోవా (66శాతం)లో మాత్రమే మోడీకి ఓటర్లు అనకూలం గా ఉన్నారు. అయితే దక్షిణాన మోడీతో పోలిస్తే ప్రజాదరణ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ముందంజలోనే ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో ప్రధానిగా మోడీ అధికారం చేపట్టడా నికి 71 ఎంపీ సీట్లను అందించి వెన్నెముకగా నిలిచిన బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలోనూ పరిస్థితి దారుణంగానే ఉన్నది. అక్కడ 43.9శాతం మంది ఓటర్లు మాత్రమే మోడీ పట్ల అనుకూలంగా ఉన్నారు. ఇక సిక్కులు మెజారిటిగా ఉండే పంజాబ్ లో 12శాతం, పశ్చిమ బెంగాల్లో 43.2శాతం మంది ఓటర్లలో మాత్రమే మోడీకి ప్రజాదరణ ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది.