Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాకుళం: అధికారంలోకొచ్చిన మూడు నెలల్లో రైతుల సంక్షేమానికి ప్రత్యేక కమిటీని వేసి, దాని సూచనల మేరకు సిఫారసులను తూచ తప్పకుండా అమలు చేస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళం, కాకినాడ, విశాఖజిల్లా పాడేరులో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై, ఐదేండ్ల ఆయన పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు రాకపోయినా .. నవరత్నాల్లో ఫించన్లు పెంచుతామని తాము హామీ ఇవ్వకపోయినా బాబు ఆ నిర్ణయం తీసుకునే వారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన ఐదేండ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు అభివృద్ధి అంటూ నిరంతరం మాటలు వల్లిస్తారని... నిన్నటి కంటే ఈరోజు బాగుంటేనే అది అభివృద్ధి అని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందో, లేదో చెప్పాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని బాబు పూర్తిగా విస్మరించారని, తాము అధికారంలోకి వస్తే విశాఖ ఏజెన్సీని ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు తమ పార్టీ వ్యతిరేకమని, అధికారంలోకి వచ్చినా బాక్సైట్ను తవ్వేది లేదని హామీ ఇచ్చారు.