Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంద్రబాబునాయుడు
ఏలూరు :'ప్రతిపక్ష నేత జగన్మో హన్రెడ్డిపై 31 కేసులున్నాయి. అన్ని కేసులున్న నిందితుడికి ఓట్లేసి గెలిపి స్తామా?' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఎన్నికల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట, కృష్ణాజిల్లా నాగాయలంక, గుంటూరు జిల్లా రేపల్లె, భట్టిప్రోలు, స్థానిక మాయ బజార్ సెంటర్లో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ జగన్ అవినీతిపై పలు విమర్శలు గుప్పించారు. జగన్కు ఓటేస్తే రాష్ట్రం నేరస్తులకు అడ్డాగా మారుతుందన్నారు. రాష్ట్రాన్ని తమ కబంధ హస్తాల్లో ఉంచుకునేందుకు, జగన్ను ఎన్నికల్లో గెలిపించేందుకు మోడీ, కెేసీఆర్లు వేల కోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. . 'ఆంధ్రులకు రోషం, పౌరుషం ఉంది... ఆంధ్రావాళ్లను ఇష్టమొచ్చినట్టు తిట్టిన కెేసీఆర్,ఏపీపై కక్ష సాధింపు చర్యలకు దిగిన మోడీకి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలు ఏకపక్షం కావాలి.' అని అన్నారు. తన రాజకీయ జీవితంలో హత్యలు ఉండవని, లా అండ్ ఆర్డర్ బలంగా అమలు చేసి హంతకుల గుండెల్లో నిద్రపోతానన్నారు.