Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ విమర్శ
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధుడు రామ్ మనోహర్ లోహియాను వ్యతిరేకించే కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీలు జట్టు కడుతున్నాయనీ, వారిది కల్తీ కూటమని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. సోషలిస్ట్ సైద్ధాంతికత గల రామ్ మనోహర్లోహియా 109వ జయంతి సందర్భంగా ఆయన గురించి సామాజిక మాధ్యమంలో ప్రస్తావించారు. లోహియా ఆలోచనలు అందరికీ స్ఫూర్తినిస్తాయన్నారు. లోహియా అత్యాధునిక వ్యవసాయ పద్ధతులతో రైతులలో సాధికారతను తీసుకొచ్చారని, ఆ విధానాలనే ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తోందని అన్నారు. దేశంలో వ్యవసాయాన్ని, పారిశ్రామికరంగాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదని లోహియా గతంలో విమర్శించారని అన్నారు.
మనోవైకల్యంతో బీజేపీ : అఖిలేశ్
బీజేపీ మనోవైకల్యంతో బాధపడుతున్నదనీ, అందుఏ ఆ పార్టీకి సంబంధంలేని వ్యక్తులైన మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్, రామ్మ నోహర్ లోహియా వంటి నేతలను గురించి వ్యాఖ్యానిస్తున్నదని సమాజ్వాదిపార్టీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. లోహియా సిద్ధాంతాల గురిం చి బీజేపీ మాట్లాడడం చూసి ఆశ్యర్య పోయానని అన్నారు. గాంధీజీ, భగత్ సింగ్, పటేల్, అంబేద్కర్, లోహియాలను అనుకరిస్తున్నామని అంటూనే వారు విబేధించే అంశాలను అమలుచేస్తున్నదని అఖిలేశ్ విమర్శించారు.