Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ పాట్నా సాహిబ్ నుంచి రవిశంకర్ బరిలోకి..
పాట్నా : ప్రధాని మోడీ విమర్శకుడు, సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా కు బీజేపీ మొండిచేయి చూపింది. 2014లో బీహార్లోని పాట్నా సాహిబ్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన సిన్హాకు ఈ సారి పార్టీ టికెట్ ఇవ్వ లేదు. బీహార్లోని పార్లమెంట్ స్థానాలకు ఎన్డీయే శనివారం ప్రకటించిన 39 మంది అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. అయితే పాట్నా సాహిబ్ స్థానం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలోకి దిగను న్నారు. రవిశంకర్ ప్రసాద్ బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, పాట్నా సాహిబ్ స్థానం నుంచే శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ టికెట్పై బరిలోకి దిగే అవకాశమున్నదని సమాచారం.