Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పష్టం చేసిన జావెద్ అఖ్తర్
- పోస్టర్ చూసి ఆశ్చర్యపోయానని వెల్లడి
ముంబయి : వివేక్ ఓబ్రాయ్ నటించిన 'పీఎం నరేంద్రమోడీ' చిత్రం కోసం తాను ఏ పాట రాయలేదని ప్రముఖ గేయరచయిత జావెద్ అఖ్తర్ ప్రకటించారు. ఆ చిత్రం పోస్టర్లో తన పేరు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. పోస్టర్లో ప్రసాద జోషి, సమీర్, అబీంద్ర కుమార్ ఉపాధ్యాయలతో పాటు తన పేరు కూడా ఉండటం చూసి షాక్కు గురయ్యానని అఖ్తర్ ట్వీట్లో పేర్కొన్నారు.