Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతదేశ తొలి లోక్పాల్ గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రంజన్ గొగోయ్ లు హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనను వెలువరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన పిసి ఘోష్ను తొలి లోక్పాల్గా మంగళవారం నియమించిన విషయం తెలిసిందే. వివిధ హైకోర్టులకు చెందిన మాజీ ప్రధాన న్యాయమూర్తులు దిలీప్ బి భోసలే, ప్రదీప్ కుమార్ మొహంతి, అభిలాషకుమారితో పాటు ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజరుకుమార్ త్రిపాఠీలను లోక్పాల్లో జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. అలాతే దినేశ్కుమార్ జైన్, అర్చనా రామసుందరం, మహేందర్ సింగ్, ఐపీ గౌతం లను నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా రాష్ట్రపతి నియమించారు. వీరంతా 70 ఏండ్లు వచ్చే నాటికి లేదా ఐదేండ్ల తర్వాత రిటైర్ అవుతారు.
జస్టిస్ ఘోష్ 2017 మేలో సుప్రీం కోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయన కోల్కతా హైకోర్టు జడ్జిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. లోక్పాల్గా నియమితులు కావడానికి ముందు జాతీయ మానవ హక్కుల చైర్మెన్(ఎన్హెచ్ఆర్సీ) సభ్యులుగా పనిచేశారు.