Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణశాఖ ప్రతినిధి ట్వీట్
న్యూఢిల్లీ: నౌకాదళ నూతన చీఫ్గా వైస్ అడ్మిరల్ కరమ్భీర్సింగ్ను నియమించనున్నట్టు రక్షణశాఖ ప్రతినిధి ట్వీటర్లో తెలిపారు. ఈ ఏడాది మేలో అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ విరమణ అనంతరం ఈ నియామకం జరుగు తుందని తెలిపారు. ప్రస్తుతం వైస్ అడ్మిరల్ కరమ్భీర్సింగ్ విశాఖపట్టణంలోని తూర్పు నేవీలో చీఫ్ ఆఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఖడకవస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన సింగ్ భారత నేవీ కమిషనర్గా 1980లో నియమితులయ్యారు. హెలికాప్టర్ పైలెట్గా 1982లో బాధ్యతలు చేపట్టారు. వాషింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన అనంతరం ముంబయిలోని కాలేజ్ ఆఫ్ నేవీ వెల్ఫేర్లో చేరారు. 36 ఏండ్లపాటు ఆయన వృత్తిలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిఫ్కు కమాండర్గా, క్షిపణులను ధ్వంసం చేసే నావల్ క్షిపణికి గైడ్గా వ్యవహరించారు.