Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల భేటీ...మోడీ సర్కారుపై మండిపాటు
- ఏపీలో ఈసీ విఫలం.. వీవీప్యాట్లు లెక్కించాలి: చంద్రబాబు
- ఈవీఎంలపై అనుమానాలున్నారు: నీలోత్పల్ బసు
- ఈసీ చర్యలపై భరోసా లేదు: కేజ్రీవాల్
- ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులను సీఈసీ నివృత్తి చేయాలి: సురవరం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల సంఘం స్వతంత్రతను మోడీ సర్కారు పూర్తి గా ప్రశ్నార్థకం చేసిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ యేతరపక్షాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యాంగ సంస్థలను ఇప్పటికే ధ్వంసం చేశా రని... అయితే, ఎన్నికల సంఘంను సైతం ప్రభావితం చేయడం అత్యంత ప్రమాదకరమని వెల్లడించాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో టీడీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఆప్, కాంగ్రెస్, జేడీఎస్, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన నేత లు భేటీ అయ్యారు. భారత రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ జన్మదిన సందర్భంగా... ఏపీ భవన్లో ఉన్నటు వంటి అంబేద్కర్ విగ్రహానికి ముందుగా చంద్రబాబు పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రతిపక్ష పార్టీల తో ఏర్పాటు చేసిన సమావేశంలో సుమారు 25 నిమిషాల పాటు పాల్గొన్నారు. అనంతరం అన్ని పార్టీల నేతలు మీడి యాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్ర బాబు మాట్లాడుతూ... ఈవీఎంలలో 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు. బీజేపీ దిశానిర్దేశంలో కాకుండా.. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ విషయం లో సుప్రీంకోర్టుకు సీఈసీ అబద్ధాలు చెప్పిందని ఈ సంద ర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఎన్నిక లలో సాంకేతికతను దుర్వినియోగం చేశారని ఆరోపిం చారు. ఆ రాష్ట్రంలో 25 లక్షల మంది ఓట్లను తొలగించారని చెప్పారు. ఎన్నికల తర్వాత అక్కడి అధికారుల క్షమాపణలు చెప్పిన తీరు మనం చూశామన్నారు. పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయ న్నారు. అదేలా సాధ్యమైందో తనకు అర్ధం కావడం లేద న్నారు. ప్రజల్లోకి వెళ్లి తమ పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామన్నారు. అధికారంలోకి రాకముందే వైసీపీ అరాచ కాలు చేస్తోందని అన్నారు. ఇలాంటి వాళ్లు వస్తే... ప్రజలు బతకగలరా... రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. తాను భయపడే రకమైతే ఎన్డీయే నుంచి ఎందుకు బయటకు వస్తా నని ప్రశ్నించారు. ఓటమి భయం అంటూ వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసు మాట్లా డుతూ... ఈవీఎంలపై ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంతవరకు కేవలం పార్టీ నాయకుల్లోనే ఈ అనుమానాలు ఉండేవని... ఇప్పుడు సామాన్య ప్రజానీకంలో సైతం అనుమానాలు వస్తున్నాయని వివరించారు. భద్రతా బలగాల వినియోగం... పోలీసు వ్యవస్థ ఉపయోగించు కోవడంలో కూడా ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ విషయంపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై సీపీఐ(ఎం) ఎప్పటి నుం చో పోరాడుతుందని వెల్లడించారు. ఇటువంటి విషయాలపై ఈసీ సహేతుకమైన వివరణ ఇచ్చి తన స్వతంత్రతను కాపా డుకోవాలని సూచించాలన్నారు. లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఈసీ నిర్వహణ లోపం కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతా ల్లో ఓటర్లు ముఖ్యంగా మహిళల ఓపిక నశించి తమ ఓటు హక్కు వినియోగించకుండానే వెనుదిరిగారని అన్నారు. గతంలో ఈవీఎంలు, వీవీప్యాట్స్లో ఓట్ల తేడాను గమని ంచామని, అందుకే, ఈవీఎంలపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చిం దని అన్నారు. ఈవీఎంలపై ఉన్న సందేహాలను తొలగిం చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని చెప్పారు. ఓట్ల లెక్కింపులో వీవీప్యాట్స్ సంఖ్యను పెంచాల్సిదిగా డిమాండ్ చేస్తున్నామని, మరో మార్గం లేదని, లేకపోతే బ్యాలెట్ పద్ధతి నే అనుసరించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ....ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు... అవలంభిస్తున్న తీరు వల్ల అది ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని వ్యాఖ్యానిం చారు. తమ డిమాండ్లకు మద్దతుగా దేశంలోని 15 ప్రాంతీయ పార్టీలు, 6 జాతీయ పార్టీలు మద్దతుగా నిలిచాయన్నారు. సీనియర్ అడ్వకేట్, కాంగ్రెెస్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ....ఎన్నికల నిర్వహణలో తమకు పేపర్ బ్యాలెట్పైనే విశ్వాసం ఉందన్నారు. యంత్రాలపై తమకు ఎంతమాత్రం విశ్వాసం లేదన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందో ఓటర్లకు తెలియటం లేదన్నారు. 50 శాతం వీవీప్యాట్ల లెక్కింపును ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్ధంకావటం లేదని కపిల్ సిబల్ చెప్పారు.