Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6లక్షల మంది డాక్టర్లు, 20 లక్షల మంది నర్సులు కావాలి
- భారత్లో సర్కారు దవాఖానాల దుస్థితి
- వైద్యసిబ్బంది లేక 'యాంటిబయాటిక్స్' వాడకంలో లోపాలు
- ప్రయివేటుకు వెళ్లి కోట్లాదిమంది అప్పులపాలు.. : 'సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ' నివేదిక
డబ్ల్యూహెచ్ఓ సూచన ప్రకారం ప్రతీ 1000మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండాలి. కానీ ఇండియాలో ప్రతీ 10,189 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉన్నాడు. అంతేకాదు, భారత్లో 6లక్షల మంది డాక్టర్ల, 20లక్షల మంది నర్సుల కొరత ఉంది. దీంతో ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేక, ప్రజలు అప్పులు చేసి ప్రయివేటు వైపు వెళ్తున్నారు. ఈ కారణంగా 5.7కోట్లమంది ఆర్థిక పరిస్థితి తారుమారు అయ్యింది.
- సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ, అమెరికా
వాషింగ్టన్ :పేదలకోసం ఆయుష్మాన్ ఆరోగ్యపథకం తెచ్చామంటూ మోడీ సర్కార్ ప్రచారం చేసుకుంటున్నది. కానీ రోగులకు ఇచ్చే సాయం అంతంతగా ఉంటే..వైద్యాన్నందించే సర్కారు దవాఖానాలను మాత్రం పట్టించుకోవటంలేదు. తాజా నివేదికతో దేశంలో ఉన్న వైద్యరంగం దుస్థితి స్పష్టమవుతున్నది. సర్కారు వైద్యాన్ని నిర్వీర్యం చేసి.. కార్పొరేట్ దవాఖానాలకు కోట్లు సమకూర్చేదిశగా కేంద్రంలోని బీజేపీ సర్కారు
చర్యలు తీసుకుంటున్నదని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు పేషంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అత్యవసరం. అందునా పేషంట్ను ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడేసేవి 'యాంటీ బయా టిక్స్'. ఈ మందుల్ని ఏ మోతాదులో, ఏ స్థాయిలో వాడాలన్నది డాక్టర్ నిర్ణయిం చాలి. ఆ మందును జాగ్రత్తగా పేషంట్ కు ఇచ్చేవారు నర్సులు. ఇంతటి కీలక మైన వీరు తగిన సంఖ్యలో ప్రభుత్వ హాస్పిటల్స్లో లేకపోతే పరిస్థితి ఏంటి? అప్పులు చేసి ప్రయివేటు హాస్పిటల్ వైద్యానికి ప్రజలు వెళ్తారు. ఇలా మన దేశంలో ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేక 5.7కోట్లమంది ఆర్థికంగా చితికిపో యారని అమెరికా సంస్థ 'సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ' సర్వే తేల్చింది.
ఈ నివేదికలో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి, ఆర్థికంగా తక్కువ, మధ్యస్థాయి గల దేశాల్లో బ్యా క్టీరియా ఇన్ఫెక్షన్లతో చనిపోతున్నవారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది. యాం టీబయాటిక్స్తో సరైన వైద్య చికిత్స అందుబాటులో లేక ప్రపంచంలో ప్రతీ ఏటా 50.7లక్షల మంది చనిపోతు న్నారు. ఉగాండా, ఇండియా, జర్మనీ...తదితర దేశాల్లో యాంటీబయాటిక్స్ వాడకంపై అధ్యయనం జరిగింది. యాంటీబయాటిక్స్ వాడకం నిపుణులైన వైద్యుల, నర్సుల సమక్షంలోనే జరగాలి. కానీ భారత్లాంటి దేశాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది.
- ప్రభుత్వ హాస్పిటల్స్లో యాంటీబయాటిక్స్ చికిత్స సరిగా అందాలంటే భారత్లో 6లక్షల మంది వైద్యులు, 20 లక్షల మంది నర్సులు కావాలి.
- హాస్పిటల్స్లో సరైన సిబ్బంది లేక యాంటీబయాటిక్స్ వాడకం తగ్గటమో, పెరగటమో జరుగుతోంది. దీనివల్ల 'యాంటీబయాటిక్-రెసిస్టెన్సీ' పెరుగుతోంది. అంటే వ్యాధి కారక క్రిములు మరింత బలపడుతున్నాయని అర్థం.
- 'రెసిస్టెన్సీ' పెరిగటం వల్ల హాస్పిటల్స్లో మంచి మందులు ఉన్నప్పటికీ అవి నిరుపయోగంగా మారే ప్రమాదం ఏర్పడింది.