Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ మీడియా చర్చల్లో మోడీ భక్త బృందం సంధిస్తోన్న ప్రశ్న
- ఐదేండ్ల పాలనలో తప్పుడు నిర్ణయాల వల్ల
- జరిగిన నష్టాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహం..!!!
న్యూడిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా.. ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్నాయంటూ బీజేపీలోని మోడీ అనుంగు అనుచర నేతలు పదేపదే సంధిస్తున్న ప్రశ్న. జాతీయ మీడియా చర్చల్లోనూ ఆ పార్టీ అధికారిక ప్రతినిధులు తమ ఐదేండ్ల పాలనా వైఫల్యాల గురించి ప్రస్తావించి నపుడెల్లా అడుగుతున్న ప్రశ్న. కానీ, ఈ ప్రశ్న వెనకున్న రాజకీయ వ్యూహం ఎవరి కైనా అర్థమయ్యేదే. తన పాలనా కాలంలో ప్రధాని మోడీ అనుసరించిన విధా నాలు, తప్పుడు నిర్ణయాల వల్ల జరిగిన నష్టాల గురించి ప్రశ్నిస్తే సమాధానాలు దాటవేయడంలో భాగంగా బీజేపీ నేతలు అనుసరిస్తున్న ఎత్తుగడ ఇది. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది తప్పుడు ప్రశ్న అని ఇట్టే అర్థమవుతుంది.
మోడీకి ప్రత్యామ్నాయం ఎవరో చెప్పండి..? రాహుల్గాంధీ, మాయావతి, అఖిలేశ్యాదవ్, మమతా బెనర్జీ,అరవింద్ కేజ్రీవాల్, చంద్రబాబునాయుడు..? అంటూ వీళ్లంతా ప్రధాని పదవి కోసం తమలో తాము గొడవ పడ్తారన్న అర్థంలో మోడీకి వ్యతిరేకంగా గళమెత్తినవారి పేర్లన్నీ ఆయన అనుచరగణం ఏకరువు పెడుతున్నారు. వాస్తవానికి మనకున్న జాతీయ పార్టీల్లోనూ, ఆ మాటకొస్తే ప్రాంతీయ పార్టీల్లోనూ మన దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న నేతలకు కొదవ లేదు. మోడీతో పోలిస్తే రాజకీయ అనుభవమేకాదు, ఉన్నత విద్యావంతులుగానూ, మేధోపరంగానూ, వ్యక్తిత్వపరంగానూ ఉన్నత నాయకత్వా నికి కొరత లేదు. మోడీ విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ తమ ప్రధాని అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంచుకోగల సామర్థ్యం కలిగి ఉన్నవే. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ప్రక్రియ వీలైనంత వేగవంతంగా ముగించగలమన్న విశ్వాసం తోనే ఇప్పటికిపుడు ప్రధాని పదవిపై చర్చలు సాగించేందుకు ఆసక్తి చూపడం లేదు. సంకీర్ణ ప్రభుత్వాల్ని నడపడంలో గతానుభవం ఉండనే ఉన్నది. గత వైఫల్యాలు తిరిగి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోగల సమర్థత, ప్రాప్త కాలజ్ఞత జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలకున్నది.
మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు..? అని ప్రశ్నిస్తున్న ఆయన అనుచరులు... ఇంతకీ మోడీ ఈ ఐదేండ్ల కాలంలో సాధించిన ఘన కార్యాలేమిటి..? అని ప్రశ్ని స్తే.. వారి నుంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం దేశ భద్రత, ఉగ్రవాదాన్ని అరికట్ట డంలో తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అంటూ జరుగుతున్న సంఘటనల్ని ఉదహరిస్తారు. వాస్తవానికి మోడీ పాలనలో ఉగ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టిందేమీ లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాక్షాత్తూ సీఆర్పీఎఫ్ జవాన్లపైనే ఆత్మాహుతి దాడి జరగడం(ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన సంఘ టన) తాజా ఉదాహరణ. కౌంటర్గా భారత సైన్యం తీసుకున్న చర్యల్ని మోడీ, ఆయన అనుచరులు తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరం, ఆక్షేపణీయం కూడా..
మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాల గురించి ప్రశ్నిస్తే వారి దగ్గర సరైన సమాధానాలుండవు. 2016 నవంబర్ 8న ఆకస్మికంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల జీడీపీకి 2 శాతంమేర(రూ.3 లక్షల కోట్లు) నష్టం జరిగిందని ఆర్థికవేత్తలు తేల్చి చెప్పారు. ప్రభుత్వ గణాంక సంస్థ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్వో) నివేదిక ప్రకారం 2017 జులై నుంచి 2018 జూన్ వరకు దేశంలో నిరుద్యోగిత 6.1 శాతానికి చేరింది. నిరుద్యోగ సమస్య 45 ఏండ్ల గరిష్టానికి చేరినట్టు ఆ నివేదిక తెలిపింది. ఇది 1972-73లో నమోదైన నిరుద్యోగిత 5.18 శాతంకన్నా అధికమన్నది గమనార్హం. ఆ సమయంలో 1971లో పాకిస్థాన్తో యుద్ధం, చమురు దిగుమతులకు ఇబ్బందుల వల్ల జరిగిన నష్టం వల్ల ఎదురైన పరిణామమది. ఇప్పుడేమైంది అన్నదే ప్రశ్న..? 2014 ఎన్ని కల ప్రచారంలో మోడీ ఇచ్చిన ముఖ్య హామీల్లో ఉద్యోగాల కల్పన ఒకటన్నది గమ నార్హం. దేశంలోని యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని మోడీ హామీ ఇచ్చారు. కానీ, కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలే ఊడిపోయిన దుస్థితి. 2017 జూన్ నుంచి 2018 అక్టోబర్ వరకు(22 నెలల్లో) కోటీ 12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సీఎంఐఈ నివేదికలో వెల్లడైంది. వీరిలో 90 లక్షలమంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. దేశంలోని నిరుద్యోగుల్లో 18.7 శాతం పట్టణప్రాంత పురుషుల వయసు 15 నుంచి 29 ఏండ్లలోపు. ఇదే వయసు పట్టణ మహిళల్లో నిరుద్యోగులు 27.2 శాతం.
మరోవైపు మోడీ పాలనలో సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడటం వేగవంతమైంది. ఇటీవలి సర్వే నివేదికల ప్రకారం దేశంలోని 73 శాతం వనరులు ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడి యాలోనూ 99 శాతం యాజమాన్యం ఆ ఒక్కశాతం చేతుల్లోనే ఉండటం గమ నార్హం. సమాజంలోని దళితులు, మైనారిటీలపై పెరిగిన దాడులు.. విభజన రాజకీయాలు, విద్వేష పూరిత వాతావరణం ఈ ఐదేండ్ల కాలంలో మోడీ సర్కార్ సాధించిన దుష్పరిణామాలు.
ఏం ఘనకార్యాలు సాధించారని మోడీకి ప్రత్యామ్నాయ ప్రధాని ఎవరన్న ప్రశ్న వేస్తున్నారంటూ సామాజికవేత్తలు, రాజకీయ పరిశీలకులు ఆయన అనుయా యుల్ని నిలదీస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 700మందికిపైగా థియేటర్ కళాకారులు విభజన రాజకీయాలను అధికారం నుంచి తొలగించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఐదేండ్ల క్రితం దేశ రక్షకుడిగా ప్రచారం పొందిన వ్యక్తి అనుసరించిన విధానాల వల్ల కోట్లమంది జీవనోపాధి కోల్పోయారని వారు తమ ప్రకటనలో గుర్తు చేశారు. నల్లధనాన్ని వెనక్కి తెస్తానని చెప్పిన వ్యక్తి హయాంలోనే బ్యాంకుల నుంచి వేల కొట్లు లూటీ చేసిన దొంగలు దేశందాటి వెళ్లిపోయారని వారు తెలిపారు. ఈయన పాలనలో ధనవంతులు మరింత ధనవంతులుగానూ, పేదలు మరింత పేదలుగానూ మారారని వారు స్పష్టం చేశారు. దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, మాజీ ఉన్నతాధికారులు ఇలాంటి విజ్ఞప్తినే ఓటర్లకు కొన్ని నెలలుగా చేస్తున్నారు.