Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశాబ్దాల వైరానికి బ్రేక్
లక్నో : లోక్సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. బీజేపీని ఓడించేందుకు మహాగట్ బంధన్గా ఏర్పడిన బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీ నేతలు శుక్రవారం మెయిన్పురిలో ప్రచార కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. ముఖ్యంగా బీఎస్పీ చీఫ్ మాయావతి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్లు తమ దశాబ్దాల శత్రుత్వానికి ఫుల్స్టాప్ పెట్టి ఒకే వేదికను పంచుకున్నారు. ఆ ఇద్దరు నేతలు కలిసి ప్రజలకు అభివాదం చేశారు. మెయిన్పురి నుంచి ములాయం సింగ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ములాయం సింగ్ మాట్లాడుతూ.. మాయావతి, తాను చాలా కాలం తర్వాత ఒకే వేదికపైకి వచ్చామని, ఆమెకు స్వాగతం, అలాగే కృతజ్ఞతలు అని అన్నారు. ఆమెను గౌరవించాల్సిందిగా తన పార్టీ శ్రేణులు, మద్దతుదారులను కోరారు. అనంతరం మాయావతి మాట్లాడుతూ.. సమాజ్వాదీ పార్టీతో చేతులు కలపడాన్ని సమర్థించుకుంది. ములాయం సింగ్ యాదవ్ నిజమైన నాయకుడని, ముఖ్యంగా వెనుకబడివర్గాలు ములాయం సింగ్నే తమ నాయకుడిగా భావిస్తున్నాయని చెప్పారు. మోడీ వెనుకబడినవర్గాలకు నకిలీ నాయకుడని, ములాయం అసలైన నేత అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్తోపాటు ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ కూడా పాల్గొన్నారు. 1995లో బీఎస్పీ చీఫ్ తమ మద్దతుదారులతో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు వారిపై దాడి చేశారు. అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.