Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు అలహాబాద్ హై కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 22 ఏండ్ల నాటి హత్య కేసులో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అశోక్ చందేల్ను దోషిగా పేర్కొంటు కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. 1997 జనవరి 29న ఐదుగురి హత్యతో అశోక్ చందేల్కు ప్రమేయముందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. రమేశ్ సిన్హా, డికె సింగ్లతో కూడిన ధార్మసనం ఎమ్మెల్యేతోపాటు మరో 10 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 'సెక్యూరిటీ గార్డులు వేద్ ప్రకాశ్ నాయక్, శ్రీకాంత్పాడేలతోపాటు మా కుటుంబంలో ముగ్గురు రాజేశ్ శుక్లా, రాకేశ్ శుక్లా, గణేశ్లు హత్యకు గురయ్యారు. ఇన్నేండ్ల మా పోరాటం ఫలించింది. మాకు న్యాయం లభించింది' అని బాధితుల కుటుంబసభ్యులు రాజీవ్ శుక్లా తీర్పు అనంతరం వ్యాఖ్యానించారు. నిందితులను కింది కోర్టు నిర్దోషులుగా విడుదలచేయటంతో పై కోర్టుకు వెళ్ళాననీ, 22 ఏండ్లకు తమకు న్యాయం దక్కిందని అన్నారు.