Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకట్టలో ఈసీ విఫలం
- మోడీ, అమిత్షాలు నోరు జారారు.. వీరి పట్ల ఈసీఐకి ఎందుకంత ఉదాసీనత..?
న్యూఢిల్లీ: విద్వేష ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకోకపోవడాన్ని కూడా నేరం గానే భావించాలని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మెజారిటీగా ఉన్న హిందు వుల ఓట్లను తనవైపు తిప్పుకోవడం ద్వారా అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలన్న బీజేపీ కుటిల వ్యూహానికి అడ్డుకట్ట వేయడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్న విమర్శ లున్నాయి. మెజా రిటీ హిందువుల్లో ముస్లిం ల పట్ల ద్వేషాన్ని రగిలిం చేలా ప్రసంగాలు చేస్తున్న బీజేపీ అగ్రనేతల నోళ్లకు తాళం వేయడంపై ఎన్నికల కమిషన్ శ్రద్ధ చూపలే దంటూ పలు ఉదాహరణల్ని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎంతటివారైనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసు కునే అధికారం భారత ఎన్నికల సంఘా నికి(ఈసీఐకి) ఉన్నది. ఈసీఐ స్వతంత్రంగా వ్యవహ రించేందుకు రాజ్యాంగం వీలు కల్పించింది.
బంగ్లాదేశీయులంతా చొరబాటుదారు లంటూ బీజేపీ నేతలు ప్రచారం చేయడం అస్సాం, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లోని మైనారిటీలను అభద్రతా భావానికి గురి చేస్తోంది. ఇటీవల తన ఎన్నికల ప్రచా రంలో భాగంగా బెంగాల్ వెళ్లిన బీజేపీ అధ్యక్షుడు అమిత్షా రారుగంజ్లో నిర్వ హించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన వారంతా చెదపురుగులంటూ తూలనాడారు. వారు మన పేదలకు దక్కాల్సిన ఆహారాన్ని తింటూ, మన ఉద్యోగాల్ని కొల్లగొడుతున్నా రంటూ రెచ్చగొట్టారు. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ప్రపంచం ముందు హిందువుల్ని కాంగ్రెస్ అవమానిస్తున్న దంటూ విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ కేరళ లోని వయనాడ్ నుంచి లోక్సభకు పోటీ చేయ డంపైనా ప్రధాని మోడీ విమర్శలు చేశారు. వయనా డ్లో మైనారిటీలు మెజారిటీగా ఉన్నందునే రాహుల్ అక్కడి నుంచి పోటీ చేశారంటూ ఎద్దేవా చేశారు. ఆ స్ధానంలో అధికంగా ఉన్న ముస్లిం ఓట్ల ద్వారా గెలవా లన్న ఉద్దేశంతోనే అక్కడి నుంచి రాహుల్ పోటీ చేశారన్న అర్థంలో ప్రధాని మాట్లాడటాన్ని లౌకికవాద పార్టీలన్నీ తప్పు పట్టాయి. మైనారిటీలనుద్దేశిస్తూ బీజేపీ నేతలు సాగిస్తున్న విద్వేష ప్రసంగాలపై ఎన్ని కల కమిషన్ కొరడా ఝలిపించి ఉంటే మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడానికి వెనకాడి ఉండే వారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.