Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలు నరుక్కున్న దళితుడు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాలతోపాటు ఉత్తర ప్రదేశ్లోనూ గురువారం పోలింగ్ జరిగింది. కాగా, ఓ దళితుడు బీఎస్పీకి ఓటువేయాలనుకు న్నాడు. కానీ, పొరపాటున అతను బీజేపీకి వేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన అతను మనస్తాపానికి గురయ్యాడు. చూపుడు వేలుకు వేసిన సిరా గుర్తు పదేపదే ఆ పొరపాటును గుర్తుచేస్తున్నది. చివరకు ఆవేశానికి లోనై.. వేలును నరికేసుకున్నాడు. పొరపాటున బీజేపీకి ఓటేవేశానంటూ విచారం వ్యక్తంచేస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో దళితుడి చూపుడువేలుకు పెద్ద బ్యాండేజ్ కట్టి ఉన్నది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. శిఖర్పుర ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (25) ఈ ఘటనకు పాల్పడ్డాడు. 'ఏనుగు గుర్తుకు ఓటేయాలనుకున్నాను. పొరపాటును పువ్వు గుర్తుకు ఓటు పడింది' అని కుమార్ వీడియోలో చెప్పారు. ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటేయాలని పోలింగ్ కేంద్రానికి వెళ్ళాననీ, పొరపాటున బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ భోలా సింగ్కు ఓటేశాననీ పవన్ వాపోతున్నారు. జరిగిన పొరపాటున తెలుసుకొని ఆవేశానికి లోనయ్యానని చెప్పాడు. 'బలవంతంగా, ఒత్తిడి మేరకు పువ్వుకు ఓటేశారా అన్న ప్రశ్నకు, పవన్ 'కాదు' అని సమాధానమిచ్చారు. గ్రామీణ, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులను గుర్తించటానికి చాలా ముఖ్యమైన మార్గం ఆయా పార్టీల గుర్తులు. ఈవీఎంలలో అక్షర క్రమంలో అభ్యర్థుల జాబితాను అమరుస్తారు. అందులోనూ ముందు జాతీయ పార్టీలు, తర్వాత ప్రాంతీయ పార్టీలు, చివరన స్వతంత్ర అభ్యర్థుల జాబితా ఉంటుంది. జాతీయ పార్టీల జాబితాలో బీజేపీ భోలా సింగ్, బీఎస్పీ యోగేశ్ శర్మల గుర్తులు ఒకదాని తర్వాత ఒకటి ఉండటంతో పొరపాటున పవన్ పొరపాటున బీఎస్పీకి బదులు బీజేపీకి ఓటువేసి ఉంటాడని భావిస్తున్నారు.