Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీకి సిద్ధంగావున్నా : రజనీకాంత్
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటన చేసినప్పటికీ, ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆయన దూరంగా వున్నారు. కాగా, శుక్రవారం ఆయన కీలక ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రజినీకాంత్ ప్రకటించారు. ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వస్తారా అన్న ప్రశ్నకు... మే 23న తెలుస్తుందని రజినీకాంత్ బదులిచ్చారు. తమిళనాడులోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపొందకపోతే.. అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో మే 23న వెలువడనున్న ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి.